మొన్నటివరకు మహేష్.. ఇప్పుడు పూజా హెగ్డే వంతు

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతుంది. ఎప్పుడు షూటింగ్ అనుకున్నా ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతోంది. మొన్నటివరకు మహేష్ బాబు కారణంగా…

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతుంది. ఎప్పుడు షూటింగ్ అనుకున్నా ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతోంది. మొన్నటివరకు మహేష్ బాబు కారణంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అంతా ఓకే అనుకున్న టైమ్ కు పూజా హెగ్డే వంతు వచ్చింది.

పూజాహెగ్డే కారణంగా ఈసారి మహేష్-త్రివిక్రమ్ సినిమా లేట్ అవుతోంది. ఇప్పటికే పలుమార్లు షూటింగ్ వాయిదా పడ్డంతో, తాజాగా అనుకున్న షెడ్యూల్ కు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది పూజా హెగ్డే. దీంతో షూటింగ్ కొంచెం డిలే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ముందుగా ఈ సినిమా షూటింగ్ ను ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేశారు. అదే టైమ్ లో కృష్ణ తన తల్లిని కోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన తండ్రిని కూడా కోల్పోయాడు. ఈ గ్యాప్ లో టోటల్ గా సినిమా స్టోరీ మారిపోయింది. దీంతో ఫస్ట్ షెడ్యూల్ మొత్తం వృధా అయినట్టయింది.

బాధ నుంచి కోలుకున్న మహేష్ ఇప్పుడిప్పుడే మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నాడు. ఓ యాడ్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. దీంతో సినిమాకు కొత్త షెడ్యూల్స్ వేశారు. అయితే ఇప్పుడు పూజాహెగ్డే వల్ల కావడం లేదు.

మరోవైపు షెడ్యూల్ మొదలుపెట్టేలోపు మ్యూజిక్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. మహేష్, తమన్, త్రివిక్రమ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిట్టింగ్స్ దుబాయ్ లో జరుగుతున్నాయి.