ఫస్ట్ కు షిప్ట్ అయిన సినిమా

విజయ్ దేవరకొండ తండ్రి నిర్మాతగా మారి, తన కొడుకుల పేర్లు నిర్మాతలుగా పెట్టి తీసిన తొలి సినిమా 'మీకు మాత్రమే చెప్తా' తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన…

విజయ్ దేవరకొండ తండ్రి నిర్మాతగా మారి, తన కొడుకుల పేర్లు నిర్మాతలుగా పెట్టి తీసిన తొలి సినిమా 'మీకు మాత్రమే చెప్తా' తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు షమ్మీర్ సుల్తాన్  దర్శకుడు. ఈనెల 18న విడుదలవుతుంది ఈ సినిమా అంటూ ఆ మధ్య ఫీలర్లు బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సినిమా నవంబర్ 1న విడుదల చేస్తామని యూనిట్ నుంచి ప్రకటన వచ్చింది.

మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది ఈ సినిమా కాన్సెప్ట్. పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా మారి, ఆ తరువాత మరో సినిమా మాత్రమే చేసిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నారు. ఈ సినిమాకు ముందు నటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో హీరోగా వస్తున్నారు.

ఇదిలావుంటే ఈ సినిమా వస్తున్న డేట్ కే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా వచ్చే అవకాశం వుంది.

బాహుబలి వేసిన బాటలో నడిచాడు 'సైరా'