విశాఖలో పీకే టీమ్… ?

పీకే…ఇపుడు ఏపీ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు ఇది. పీకే అంటే ప్రశాంత్ కిశోర్. మంచి రాజకీయ‌ వ్యూహకర్త. ఈ మాటలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పీకే పవర్ ఏంటి అన్నది 2019 ఎన్నికలు…

పీకే…ఇపుడు ఏపీ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు ఇది. పీకే అంటే ప్రశాంత్ కిశోర్. మంచి రాజకీయ‌ వ్యూహకర్త. ఈ మాటలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పీకే పవర్ ఏంటి అన్నది 2019 ఎన్నికలు ఏపీలో రుజువు చేశాయి.

ఇక పీకే సేవలను మరో మారు వాడుకుంటామని వైసీపీ పెద్దలు చెబుతున్న నేపధ్యంలో పొలిటికల్ గా హాట్ టాపిక్ గా పీకే మారుతున్నారు. తొందరలోనే ఏపీ వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాలలో పీకే టీమ్ టూర్ చేసి సర్వేలు నిర్వహిస్తుంది అన్న మాట ప్రచారంలో ఉంది.

అయితే పీకే టీమ్ ఇప్పటికే పని మొదలెట్టేసింది అంటున్నారు. అలా పీకే టీమ్ ఎంచుకున్న తొలి జిల్లాగా విశాఖను పేర్కొంటున్నారు. విశాఖలో పీకే టీమ్ రంగంలోకి దిగిపోయిందని అంటున్నారు.

మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి సహా కీలక నేతల పని తీరు మీద పీకే టీమ్ ఏ రకమైన సమాచారం సేకరిస్తోంది అన్నది ఉత్కంఠను రేపుతోంది. 

అదే టైమ్ లో వైఎస్ జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఏపీలో రెండున్నరేళ్ళుగా సాగుతున్న పాలన మీద కూడా విశాఖ నుంచే తొలి శాంపిల్ సర్వే వెలువడుతుంది అంటున్నారు. సో ఇది బాగా ఇంటరెస్టింగ్ మ్యాటరే. రిజల్ట్ కోసం వెయిట్ అండ్ సీ.