సుజిత్ కేరాఫ్ గోవా

బాహుబలి ప్రభాస్ తో సాహో సినిమాను అందించిన డైరక్టర్ సుజిత్ ఎక్కడ వున్నారు. ఓ సినిమా విడుదల కు ముందో, వెనుకో మీడియాకు అందుబాటులోకి రావడం అన్నది ప్రతి డైరక్టర్ చేసే పని. సినిమాకు…

బాహుబలి ప్రభాస్ తో సాహో సినిమాను అందించిన డైరక్టర్ సుజిత్ ఎక్కడ వున్నారు. ఓ సినిమా విడుదల కు ముందో, వెనుకో మీడియాకు అందుబాటులోకి రావడం అన్నది ప్రతి డైరక్టర్ చేసే పని. సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి మరింత బలంగా మీడియాలో పబ్లిసిటీ చేసేందుకు వీలుగా డైరక్టర్ అందుబాటులో వుండడం కూడా కామన్.

కానీ సాహో డైరక్టర్ సుజిత్ మాత్రం ఎక్కడ వున్నారన్నది తెలియడం లేదు.  సినిమా విడుదల  ముందు ఎక్కువ కాలం ముంబాయి, చెన్నయ్ లో వున్నారు. మధ్యలో అవసరం అయినపుడు ఒక్కో రోజు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. సినిమా విడుదలయింది. అభిమానులు చాలా వరకు సుజిత్ మీద ఆగ్రహంతో వున్నారు. వెయ్యి కోట్ల సినిమా అవుతుందనుకున్న సినిమా రేంజ్  సుజిత్ కారణంగానే తగ్గిందన్నది వారి బాధ. 

నిర్మాతలు, హీరో అంత నమ్మకం పెట్టుకుని, అంత పెద్ద బాధ్యత అప్పగిస్తే, పాడు చేసాడన్నది అభిమానుల మాట. అయితే సినిమా ఇలా వుంటుందని, అభిమానులు తనపై విరుచుకు పడతారని సుజిత్ ముందుగానే గ్రహించినట్లు తెలుస్తోంది. క్యూబ్ లో అప్ లోడ్ చేసినపుడు సినిమా మొత్తం చూసి, విడుదలకు ముందే ఫోన్ స్విచాఫ్ చేసి,గోవాకు జంప్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సుజిత్ గోవాలో విశ్రాంతిలో వున్నారని, ఫోన్ స్విచాఫ్ చేసారని, ఎవరికీ రెస్పాండ్ కావడం లేదని తెలుస్తోంది. మరి ఎప్పుడు వెనక్కు వచ్చి, మళ్లీ రొటీన్ లో పడతాడో చూడాలి.