ఉమ్మ‌డి మ్యానిఫెస్టోలో ఈ ప‌థ‌కాలుంటాయా?

టీడీపీ, జ‌న‌సేన పార్టీల పొత్తులో భాగంగా ఇవాళ మ‌రో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఎన్టీఆర్ భ‌వ‌న్ వేదిక‌గా ఉమ్మ‌డి మ్యానిఫెస్టో త‌యారీపై సోమ‌వారం మొద‌టి స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన వేర్వేరుగా కొన్ని…

టీడీపీ, జ‌న‌సేన పార్టీల పొత్తులో భాగంగా ఇవాళ మ‌రో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఎన్టీఆర్ భ‌వ‌న్ వేదిక‌గా ఉమ్మ‌డి మ్యానిఫెస్టో త‌యారీపై సోమ‌వారం మొద‌టి స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన వేర్వేరుగా కొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌పై హామీలిచ్చిన సంగ‌తి తెలిసిందే.

సూప‌ర్ సిక్స్ పేరుతో మ‌హిళ‌లు, యువ‌త‌కు టీడీపీ పెద్ద‌పీట వేస్తూ కొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌హానాడు వేదిక‌గా ప్ర‌క‌టించింది. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ష‌ణ్ముక వ్యూహం పేరుతో అర్థం కాని ప‌థ‌కాలేవో ప్ర‌క‌టించారు. ఇప్పుడు రెండు పార్టీల ఆలోచ‌న‌లు క‌ల‌గ‌లిపి కొత్త వంట‌కాన్ని రెడీ చేయ‌నున్నారు. ఇందుకోసం ఇటు, అటు ముగ్గ‌రేసి చొప్పి నాయ‌కుల‌ను క‌మిటీల్లో నియ‌మించారు. వీళ్లంతా ఇవాళ స‌మావేశం కానున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌, లోకేశ్‌ల‌పై నెటిజ‌న్లు ట్రోలింగ్‌కు దిగారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లను క‌ట్ డ్రాయ‌ర్ల‌పై నిల‌బెడ‌తాన‌ని లోకేశ్ హామీ ఇచ్చార‌ని, సంబంధిత ప‌రిశ్ర‌మ నెల‌కొల్పేందుకు మ్యానిఫెస్టోలో చోటు ద‌క్కుతుందా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. అలాగే రెడ్ డైరీలో రాసుకున్న ప్ర‌తిదానికి మ్యానిఫెస్టోలో చేర్చి అధికారికంగా చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తారా? అని లోకేశ్‌పై నెటిజ‌న్లు పంచ్‌లు విస‌ర‌డం గ‌మ‌నార్హం.  

అలాగే తాము అధికారంలోకి వ‌స్తే దెబ్బ‌కు దెబ్బ తీస్తామ‌ని, ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని లోకేశ్ ప‌దేప‌దే చెప్పార‌ని, క్ష‌త‌గాత్రుల‌య్యే ప్ర‌తిప‌క్ష పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల కోసం ప్ర‌త్యేకంగా ఆస్ప‌త్రులు క‌డ‌తామ‌ని మ్యానిఫెస్టోలో చెబుతారా? అని లోకేశ్‌ను వ్యంగ్యంగా ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే … ప్ర‌త్య‌ర్థుల‌ను చెప్పుతో కొడ‌తాన‌న్నార‌ని, అధికారంలోకి వ‌స్తే అలాంటి ప‌రిశ్ర‌మ ఏదైనా తీసుకొస్తామ‌ని మ్యానిఫెస్టోలో చేరుస్తారా? అని నిల‌దీస్తున్నారు. అలాగే విడాకులు ఇచ్చే క్ర‌మంలో భార్య‌కు భ‌ర‌ణం చెల్లించేందుకు ప్ర‌త్యేక బ‌డ్జెట్ తీసుకొస్తామ‌నే హామీ వుంటుందా? లేదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. బ‌హు భార్య‌త్వం నేరం కాద‌ని ఒక చ‌ట్టాన్ని తీసుకొస్తామ‌ని జ‌న‌సేన త‌ర‌పున మ్యానిఫెస్టోలో చేర్చుతున్నారా? లేదా? అని ప‌వ‌న్‌ను సెటైర్స్‌తో చిత‌క్కొడుతున్నారు. 

ఇక తాము అధికారంలోకి వ‌స్తే వైసీపీ నేత‌ల్ని చ‌ర్మం తీస్తామ‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే హెచ్చ‌రించార‌ని, తోలు ప‌రిశ్ర‌మ తీసుకొచ్చే ఆలోచ‌న వుందా? లేదా? అని నెటిజ‌న్లు వ్యంగ్యంగా నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.