హీరోయిన్ కల.. ముంబయిలో సౌతిండియా హోటల్

ప్రతి హీరోయిన్ కు ఓ కల ఉంటుంది. శృతిహాసన్ కు కూడా అలాంటి ఓ కల ఉంది. ఎప్పటికైనా పెద్ద సింగర్ అయి, తన మ్యూజికల్ బ్యాండ్ ను స్టార్ ను చేయాలనేది ఆమె…

ప్రతి హీరోయిన్ కు ఓ కల ఉంటుంది. శృతిహాసన్ కు కూడా అలాంటి ఓ కల ఉంది. ఎప్పటికైనా పెద్ద సింగర్ అయి, తన మ్యూజికల్ బ్యాండ్ ను స్టార్ ను చేయాలనేది ఆమె కల. అయితే దీంతో పాటు శృతిహాసన్ కు మరో చిలిపి కోరిక కూడా ఉంది.

నిత్యం ముంబయిలో ఉంటూ సౌతిండియా భోజనాన్ని మిస్ అవుతుంటుంది శృతి. అందుకే ముంబయిలో తన టేస్ట్ కు తగ్గట్టు సౌతిండియా రెస్టారెంట్ ఒకటి నెలకొల్పాలనేది శృతిహాసన్ కోరిక అంట.

“వంట చేయడం నాకు చాలా ఇష్టం. నేను చేసిన వంటను నలుగురికి తినిపించడం ఇంకా ఇష్టం. నాకంటూ ఓ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ కూడా ముంబయిలో ఉండాలి. అందులో తమిళ సాంబార్, ఆంధ్రా పప్పు ఉంటే చాలు. జీవితాంత బతికేయొచ్చు.”

ఇలా తన మనసులో ఉన్న ఆలోచనను బయటపెట్టింది శృతిహాసన్. ఈమధ్య కాలంలో భోజనం అంటే చాలు, ఆమెకు ప్రభాస్ గుర్తొస్తున్నాడట. దానికి రీజన్ కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

“సలార్ షూట్ లో ఉన్నప్పుడు ప్రభాస్ నాకు భోజనం పంపిస్తానన్నాడు. భోజనమే కదా ఓకే అన్నాను. ఏకంగా 40 వెరైటీలు పంపించాడు. అవన్నీ నేను తినలేకపోయాను. కొంచెం కొంచెం అన్నీ టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి. ఈసారి ఇంకొన్ని వెరైటీలు పంపిస్తానన్నాడు ప్రభాస్. అస్సలు వద్దని చెప్పాను. ఎందుకంటే నేను ఎక్కువ తినను. 2-3 రకాలు చాలు నాకు. సరే ఈసారి డెజర్ట్ పంపిస్తానని చెప్పి, 3 సంచుల నిండా డెసెర్ట్ పంపించాడు.”

ఇలా ప్రభాస్ తో తన ఫుడ్ ఎక్స్ పీరియన్స్ ను పంచుకుంది శృతిహాసన్. ఆంధ్రాలోని ఓ ప్రాంతానికి చెందిన ప్రభాస్ కు భోజనం తినడమే కాదు, నలుగురికి పెట్టడం చాలా ఇష్టమని, అది అతడి వారసత్వమని అంటోంది శృతిహాసన్.