పరుశురామ్ అక్కడ సెటిల్?

గీతగోవిందం తరువాత డైరక్టర్ పరుశురామ్ చూపంతా సూపర్ స్టార్ మహేష్ బాబు మీదే. కానీ అక్కడ వర్కవుట్ అయిన దాఖలాలు కనిపించడం లేదు. వంశీ పైడిపల్లితోనే తరువాత సినిమా చేయాలని మహేష్ బాబు ఫిక్సయిపోయినట్లు…

గీతగోవిందం తరువాత డైరక్టర్ పరుశురామ్ చూపంతా సూపర్ స్టార్ మహేష్ బాబు మీదే. కానీ అక్కడ వర్కవుట్ అయిన దాఖలాలు కనిపించడం లేదు. వంశీ పైడిపల్లితోనే తరువాత సినిమా చేయాలని మహేష్ బాబు ఫిక్సయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ఆఫీసు ఖర్చులు ప్రత్యేకంగా స్టార్ట్ చేసారు కూడా.

మహేష్ బాబును ట్రయ్ చేస్తూనే, ఎన్టీఆర్ కు కూడా పరుశురామ్ కథ వినిపించారని, కానీ అక్కడ సెట్ కాలేదని కూడా గుసగుసలు వున్నాయి. అవన్నీ అలావుంచితే ఆ కథ నిర్మాత అరవింద్ ను నచ్చకపోవడంతో, ఆ సైడ్ కూడా ఖాళీ అయింది.

లేటెస్ట్ గ్యాసిప్ ఏమిటంటే, అఖిల్ హీరోగా, నాగార్జున నిర్మాతగా పరుశురామ్ సినిమా చేయడానికి తాత్కాలికంగా ఓ మాట అనుకున్నారన్నది. పరుశురామ్ చెప్పిన స్టోరీకి ఖర్చు కాస్త ఎక్కువ అవుతుందని, అఖిల్ తో అంత ఖర్చుకు ముందుకు వచ్చే ధైర్యం ఏ నిర్మాత చేయరు కనుక, నాగార్జునే ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

పరుశురామ్-అఖిల్ వెంచర్ కూడా ఏ మేరకు పక్కా అవుతుందో మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?