జ‌న‌నేత‌పై వెల్లువెత్తిన జ‌నాభిమానం

జ‌న‌నేత, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిపై తిరుప‌తి వాసుల అభిమానం వెల్లువెత్తింది. వైఎస్సార్ 12వ వ‌ర్ధంతిని తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. వైఎస్సార్‌కు భూమ‌న అత్యంత ఆత్మీయుడు.  Advertisement త‌మ…

జ‌న‌నేత, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డిపై తిరుప‌తి వాసుల అభిమానం వెల్లువెత్తింది. వైఎస్సార్ 12వ వ‌ర్ధంతిని తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. వైఎస్సార్‌కు భూమ‌న అత్యంత ఆత్మీయుడు. 

త‌మ ప్రియ‌త‌మ నేత వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని తిరుప‌తి నగ‌రంలో న‌లువైపులా ఆయ‌న్ను కీర్తిస్తూ భూమ‌న భారీ హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇవి న‌గ‌ర‌వాసుల‌తో పాటు తిరుప‌తి, తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

ఈ నేప‌థ్యంలో గురువారం తుడా స‌ర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వేలాది మంది వైఎస్సార్ అభిమానుల మ‌ధ్య వైఎస్సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు, అభిమానులు చేత‌ప‌ట్టిన ఆరోగ్య దాతా..అందుకో దండాలు, నీ చిరు ద‌ర‌హాసం-జ‌న క్షేమం కోసం, జ‌న‌నేతా… జోహార్లు త‌దిత‌ర ప్ల‌కార్డులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌కు మ‌ర‌ణం లేద‌న్నారు. వైఎస్సార్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు ఆయ‌న్ని చిరంజీవిగా నిలిపాయ‌ని కొనియాడారు. ప్ర‌త్య‌ర్థుల పాలిట పిడుగులాంటి త‌న‌యుడిని స‌మాజానికి అందించార‌ని భూమ‌న అన్నారు.

ముస్లిం జేఏసీ, యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో అన్న‌దానం, ర‌క్త‌దానం జ‌రిగింది. వైఎస్ వ‌ర్ధంతి నిర్వ‌హ‌ణలో తిరుప‌తి ప్ర‌త్యేకంగా నిలిచింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, డిప్యూటీ మేయ‌ర్లు ముద్ర నారాయ‌ణ‌, భూమ‌న అభిన‌య్‌రెడ్డి , భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.