లోకేష్, ప‌వ‌న్ ల‌పై విరుచుకు పడిన కొడాలి నాని!

నిన్న జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ ను వాయించిన కొడాలి నాని ఇవాళ కూడా చంద్రబాబు వారసుడు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ను తనదైన శైలిలో వాయించాడు. పనికిమాలిన పప్పు లోకేష్…

నిన్న జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ ను వాయించిన కొడాలి నాని ఇవాళ కూడా చంద్రబాబు వారసుడు లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ను తనదైన శైలిలో వాయించాడు. పనికిమాలిన పప్పు లోకేష్ సీఎం గురించి మాట్లాడే స్ధాయి లేద‌న్నారు. రాష్ట్రంలో పనికిమాలిన దద్దమ్మ ఎవరైనా ఉన్న‌రంటే అది లోకేష్ నే అన్నారు. ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై విమ‌ర్శలు కురిపించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడు పోయిన వ్య‌క్తన్నారు.

లోకేష్ ప‌నికి రాని సుంట కాబ‌ట్టే.. చంద్ర‌బాబు ప‌క్క పార్టీపై అధార‌ప‌డుతున్నార‌ని, ఎమ్మెల్యే గెలవలేని చవట, దద్దమ్మ అంటూ ఏద్దేవా చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు టీడీపీ నేత‌ల‌కు కూడా లోకేష్ ప‌ప్పు అనే సంగ‌తి తెలుసన్నారు. లోకేష్ కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియ‌ని ఎద‌వకు పిల్లికి, పులికి తేడా తెలియ‌డం లేద‌ని అందుకే మంగ‌ళ‌గిరిలో నీవు ఓడిపోయావు అంటూ విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ప్ర‌జ‌స్వామం గురించి మాట్లాడుతుంటే ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని, అమిత్ షా వ‌చ్చిన‌ప్పుడు రాళ్లు వేసిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడుద‌ని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కొట్టించిన ఘ‌న‌త కూడా చంద్ర‌బాబుకే ద‌క్కుతుందని అప్పుడు ప్ర‌జ‌స్వామం క‌న‌ప‌డ‌లేదా అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్యాకేజీ తీసుకోని రాజ‌కీయం చేస్తున్నారని త‌న చెప్పును 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు జాగ్ర‌త‌గా పెట్టుకొని ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌ చంద్ర‌బాబు నాయుడును కొట్టాల‌ని స‌ల‌హ ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒక వైపు, ప‌చ్చ ద‌ళం ఒక వైపు ఉంటుంద‌ని ఎవ‌రూ ఎంత మంది క‌లిసి వ‌చ్చినా వైసీపీ విజ‌యాన్ని అడ్డుకోలేర‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ- జ‌న‌సేన కలిసి పోటీ చేయ‌బోతున్నారు, కాక‌పోతే బీజేపీ వ‌స్తే బీజేపీతో లేక‌పోతే కాంగ్రెస్ పార్టీతో బీజేపీ-జ‌న‌సేన కుట‌మి జ‌త క‌ట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.