పవన్ కళ్యాణ్- చంద్రబాబు కలయికపై వైసీపీ మంత్రులు, నేతలు విమర్శల స్పీడ్ పెంచారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో పవన్ కళ్యాణ్- చంద్రబాబు నాయుడు కు సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన చెప్పును చాలా జాగ్రత్తగా పెట్టుకోమని అది తనకే ఉపయోగపడుతుందని సలహా ఇచ్చారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తన చెప్పుతో తానే కొట్టుకొని, తరువాత అదే చెప్పు చంద్రబాబు నాయుడును కొట్టడానికి ఉపయోగపడుతుందని అందుకే ఆ చెప్పును జాగ్రత్తగా పెట్టుకోమన్నారు.
సిగ్గు లేకుండా తన తల్లిని తిట్టిన వారితోనే కలిసినడుస్తున్నాడని అందుకే ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూన్నారని మండిపడ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే జనసేన పుట్టిందని, ఇలాంటి వందమంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరన్నారు.
పవన్ కు కాపులు, ప్రజలు ముఖ్యం కాదని కేవలం చంద్రబాబు ప్రయోజనలే ముఖ్యం అని అందుకే విశాఖ గర్జన జరుగుతుంటే దానిని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు చెప్పితే పవన్ ను విశాఖ వెళ్లి హడవుడి చేశారన్నారు. ఎయిర్ పోర్టు దగ్గర మంత్రులపై దాడి చంద్రబాబు డైరక్షన్ లోనే జరిగిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం పవన్ లక్ష్యమైతే, 175 సీట్లు వైయస్ జగన్ లక్ష్యం అన్నారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175కి సీట్లు గెలుస్తుందన్నారు.