క్రేజీ ఫెలో కృతజ్ఞతలు

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్…

యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న  విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

హీరో ఆది మాట్లాడుతూ..  క్రేజీ ఫెలోకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి రివ్యూలు వస్తున్నాయి. మౌత్ టాక్ అద్భుతంగా వుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని చేశాను. నిర్మాత రాధమోహన్ ఎక్కడ రాజీ పడకుండా తీశారు. దర్శకుడు ఫణి కృష్ణ కథని చాలా ప్రేమించి ఈ సినిమా తీశారు. ఒక మంచి సినిమా చేశాం. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి''అని కోరారు.

దిగంగన సూర్యవంశి మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు.  సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అందరూ సినిమాని థియేటర్ లో చూడాలి'' అని కోరారు.

మిర్నా మీనన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా మంచి పాత్ర ఇచ్చారు. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తోంది. ఈ సినిమాకి మంచి విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు.

నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. క్రేజీ ఫెలో కోసం మంచి టీం వర్క్ చేశాం. ఈ విజయం అందరి సమిష్టి కృషి. క్రేజీ ఫెలో ప్రేక్షకుల అభిమానం పొందడం చాలా అనందంగా వుంది. క్రేజీ ఫెలో క్లీన్  ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ కూర్చిని హాయిగా థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా వుంది. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ చక్కగా నటించారు. ఫణి కృష్ణ ఈ సినిమాతో తన ప్రతిభ చాటుకున్నారు. తనని మా బ్యానర్ లో పరిచయం చేయడం ఆనందంగా వుంది. ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రేక్షకులు అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి'' అని కోరారు.

దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ.. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని క్రేజీ ఫెలో తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మార్నింగ్,  ఈవినింగ్ షోకి మంచి గ్రోత్ వుంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రాధమోహన్, హీరో ఆది కి కృతజ్ఞతలు అన్నారు.

నర్రా శ్రీనివాస్, సతీష్ ముత్యాల, నవీన్, జిత్తు, దీపు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.