బాబు, లోకేశ్‌ల‌కు ముదిరిన పిచ్చి

ఇటీవ‌ల కేబినెట్ భేటీలో దుష్ట‌చ‌తుష్ట‌యం దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆదేశాలు ఇవ్వ‌డంతో మంత్రులు రెచ్చిపోతున్నారు. సౌమ్యులుగా పేరు పొందిన నాయ‌కులు సైతం ఘాటుగా స్పందించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. టీడీపీ నేత‌లు,…

ఇటీవ‌ల కేబినెట్ భేటీలో దుష్ట‌చ‌తుష్ట‌యం దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆదేశాలు ఇవ్వ‌డంతో మంత్రులు రెచ్చిపోతున్నారు. సౌమ్యులుగా పేరు పొందిన నాయ‌కులు సైతం ఘాటుగా స్పందించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. టీడీపీ నేత‌లు, ఎల్లో మీడియా ప‌నిగ‌ట్టుకుని ప్ర‌భుత్వంతో పాటు జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల్ని టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ‌శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై రెచ్చిపోయారు. తండ్రీత‌న‌యులిద్ద‌రికీ పిచ్చి ముదిరిపోయింద‌ని విరుచుకుప‌డ్డారు. బ్రోక‌ర్లు, జోక‌ర్ల‌కు తెలుగుదేశం పార్టీ నిల‌య‌మైంద‌ని ఆరోపించారు. ఉత్త‌రాంధ్ర‌కు అమ‌రావ‌తి పాద‌యాత్ర వెనుక టీడీపీ కుట్ర వుంద‌ని ఆయ‌న ఆరోపించారు. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని విశాఖ‌కు వ‌ద్దే వ‌ద్ద‌ని అమ‌రావ‌తి నుంచి టీడీపీ పాద‌యాత్ర చేయిస్తున్న‌ట్టు వైసీపీ భావ‌న‌. అదే విష‌యాన్ని త‌న విమ‌ర్శ‌ల్లో కొట్టు స‌త్య‌నారాయ‌ణ వ్య‌క్త‌ప‌రిచారు. ఉద్దేశ పూర్వ‌కంగానే అమ‌రావ‌తి రైతుల‌ను టీడీపీ రెచ్చగొడుతోంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను సృష్టించేందుకు టీడీపీ కుట్ర ప‌న్నుతోంద‌న్నారు.

టీడీపీ ముగిసిపోయిన అధ్యాయ‌మ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. చంద్ర‌బాబు పార్టీ, ఆయ‌న ద‌త్త‌పుత్రుడి రాజ‌కీయం వెంటిలేట‌ర్‌పై ఉన్నాయ‌న్నారు. చంద్ర‌బాబు, ఆయన ద‌త్త పుత్రుడిని బ‌తికించుకోవాల‌ని ఎల్లో మీడియా ఎంత ప్ర‌య‌త్నించినా ప్ర‌యోజ‌నం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటు త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌న్నారు.