అప్పుడు మిస్టిక్ థ్రిల్లర్.. ఇప్పుడు మైథిక్ థ్రిల్లర్

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది విరూపాక్ష. సాయితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు, ఈ హీరోను వంద కోట్ల క్లబ్ లోకి చేర్చింది. ఈ సినిమాతో…

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది విరూపాక్ష. సాయితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు, ఈ హీరోను వంద కోట్ల క్లబ్ లోకి చేర్చింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ డైరక్టర్ అనిపించుకున్నాడు కార్తీక్ దండు.

షార్ట్ గ్యాప్ లోనే విరూపాక్ష టీమ్ మరోసారి కలిసింది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకనిర్మాత సుకుమార్, దర్శకుడు కార్తీక్ దండు కలిసి మరో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు. మిస్టిక్ థ్రిల్లర్ గా విరూపాక్ష సినిమాను తెరకెక్కించిన ఈ యూనిట్, ఈసారి మైథికల్ థ్రిల్లర్ తో రాబోతున్నట్టు తెలిపింది.

కార్తీక్ దండు రాసుకున్న విరూపాక్ష కథకు, తనదైన మార్పుచేర్పులు సూచించాడు సుకుమార్. అలా సుకుమార్ టచ్ తో వచ్చిన విరూపాక్ష పెద్ద హిట్టయింది. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం కూడా సుకుమార్ సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు కార్తీక్ దండు. ఆల్రెడీ సుకుమార్ తో కథా చర్చలు మొదలయ్యాయని, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని ప్రకటించారు.

ఈ సినిమా కథ కార్తీక్ దండుదే. చిన్నచిన్న మార్పులతో పాటు, స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించబోతున్నాడు. హీరోహీరోయిన్లు ఎవరనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. హీరో ఎవరనేది త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు.