ఆయనో యాక్టర్.. ఈయనో కొడుకు… ?

అలుగుటయే ఎరుగని అజాతశతృవు అన్నట్లుగా వైసీపీలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఉంటారు. ఆయన రాజకీయాలు పెద్దగా మాట్లాడరు, తన పనేంటో తానేంటో అన్నట్లుగా సైలెంట్ గా ఉంటారు. అలాంటి ధర్మాన మాట్లాడితే…

అలుగుటయే ఎరుగని అజాతశతృవు అన్నట్లుగా వైసీపీలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఉంటారు. ఆయన రాజకీయాలు పెద్దగా మాట్లాడరు, తన పనేంటో తానేంటో అన్నట్లుగా సైలెంట్ గా ఉంటారు. అలాంటి ధర్మాన మాట్లాడితే మాత్రం ధర్మంగానే ఉంటుందని చెబుతారు.

ఆయన తాజాగా ఏపీలో ఇద్దరు నాయకుల మీద చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఆయనో యాక్టర్ అంతే అంటూ సింపుల్ గా చెప్పేశారు. అలాగే లోకేష్ అంటే ఎవరు, ఏమిటి అంటే ఆయన కేవలం చంద్రబాబు కుమారుడు మాత్రమేనని కూడా ధర్మాన అంటున్నారు.

ఈ ఇద్దరు నాయకుల గురించి మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని కూడా ధర్మాన ఈ సందర్భంగా అనడం విశేషం. వారు  ఏవేవో మాట్లాడుతారు, కానీ గ్రామంలో ఉండే సగటు వ్యక్తికే వీరి కంటే బాగా ఎక్కువ తెలుసు అని ధర్మాన సెటైర్లు పేల్చారు. 

జగన్ ని విమర్శించడమే వారి పని అంటూ ఆయన మండిపడ్డారు. మొత్తానికి ధర్మాన సంధించిన ఈ డైలాగులు బాగా చర్చకు వస్తున్నాయి.