సందడే సందడి.. ఒక్కసారిగా సెట్స్ పైకి సినిమాలు

బహుశా ఈరోజు మంచి రోజేమో. సినిమాలన్నీ గంపగుత్తగా ఒకేసారి సెట్స్ పైకి వచ్చాయి. ఇప్పటికే రాధేశ్యామ్, ఆచార్య, ఆదిపురుష్ లాంటి సినిమాలు సెట్స్ పైకి రాగా.. ఈరోజు సర్కారువారి పాట, అఖండ లాంటి సినిమాల…

బహుశా ఈరోజు మంచి రోజేమో. సినిమాలన్నీ గంపగుత్తగా ఒకేసారి సెట్స్ పైకి వచ్చాయి. ఇప్పటికే రాధేశ్యామ్, ఆచార్య, ఆదిపురుష్ లాంటి సినిమాలు సెట్స్ పైకి రాగా.. ఈరోజు సర్కారువారి పాట, అఖండ లాంటి సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. అఖిల్, రామ్ కొత్త సినిమాలు కూడా షురూ అయ్యాయి.

బాలయ్య సెట్స్ పైకొచ్చాడు. బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లో ఉన్న అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

అటు మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా కూడా ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ లోకి ఎంటరైంది. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ స్టార్ట్ అయింది. మహేష్ తో పాటు మరికొంతమంది లీడ్ ఆర్టిస్టులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు.

ఇక అఖిల్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇవాళ మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా ఈ రోజు సెట్స్ పైకి వచ్చింది. ఇదొక స్పై థ్రిల్లర్. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

రామ్ కొత్త సినిమా కూడా ఈరోజే సెట్స్ పైకొచ్చింది. లింగుసామి దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. గండిపేట్ లో కొంతమంది నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు. అయితే ఈరోజు రామ్ మాత్రం జాయిన్ కాలేదు. ఉప్పెన ఫేమ్ కృతిషెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

లెక్కప్రకారం, పవన్ కల్యాణ్-రానా మూవీ కూడా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి రావాలి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు కూడా. కానీ ఆఖరి నిమిషంలో సినిమాటోగ్రాఫర్ తో సమస్యలు రావడంతో షెడ్యూల్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ ఇది.