ప్రభాస్-పూజాహెగ్డే.. మొదటి రోజు ఇలా..!

ఎట్టకేలకు రాధేశ్యామ్ ఆఖరి షెడ్యూల్ మొదలైంది. నిన్న ప్రారంభమైన ఈ ఫైనల్ షెడ్యూల్ కోసం పూజా హెగ్డే, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చింది. తను సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని పూజా హెగ్డే…

ఎట్టకేలకు రాధేశ్యామ్ ఆఖరి షెడ్యూల్ మొదలైంది. నిన్న ప్రారంభమైన ఈ ఫైనల్ షెడ్యూల్ కోసం పూజా హెగ్డే, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చింది. తను సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని పూజా హెగ్డే బయటపెట్టింది కూడా.

అటుఇటుగా 10 రోజుల పాటు జరగనుంది ఈ షెడ్యూల్. మొదటి రోజు ప్రభాస్-పూజాహెగ్డే మధ్య కొన్ని సన్నివేశాలు తీశారు. ఈరోజు కూడా ప్యాచ్ వర్క్ కు సంబంధించిన సన్నివేశాలే తీయబోతున్నారు. ఇక సోమవారం నుంచి సినిమాకు సంబంధించి చివరి సాంగ్ షూట్ మొదలవుతుంది. ఇది డాన్స్ నంబర్ కాదు. మాంటేజ్ సాంగ్ టైపులో సాగుతుంది.

ఆ పాట షూటింగ్ తో రాధేశ్యామ్ టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో ఇటలీ రైల్వేస్టేషన్ ను తలపించే సెట్ వేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సెట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా మరో రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు. ఆ వెంటనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రాధేశ్యామ్ సినిమా. సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇతడు జాతకం చెబితే అది అక్షరాలా నిజమౌతుంది. 

ఇక ప్రేరణ అనే డాక్టర్ పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతోంది. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది..? ప్రభాస్ జాతకాని, పూజా వైద్య వృత్తికి లింక్ ఏంటనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.