తెల్లవారితే గురువారం…నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న విభిన్న చిత్రం. కీరవాణి తనయుడు సింహా కోడూరి హీరో. కొత్త దర్శకుడు మణికాంత్ అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం దిగ్గజాలు రంగంలోకి దిగుతున్నాయి.
హీరో చిన్నాన్న, దర్శకుడు రాజమౌళి, అలాగే ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడు హీరో ఎన్టీఆర్ కలిసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాబోతున్నారు.
ఈ ఫంక్షన్ 21న జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ రాకుండా చూసుకుని ఈ ఫంక్షన్ ప్లాన్ చేసారు. సినిమాకు హీరో మాత్రమే కాదు, సంగీత దర్శకుడు కాలభైరవ కూడా కీరవాణి కుమారుడే.
అందుకే ఈ సినిమా ఆ ఫ్యామిలీకి అత్యంత కీలకం. మనమంతా, పటేల్ సర్, యుద్దం శరణం, పహిల్వాన్, విజేత సినిమాల తరువాత వారాహి చలన చిత్ర సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది.