3న యూసఫ్ గుడాలో ‘వకీలు’

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ విడుదల దగ్గరకు వస్తోంది. పోస్ట్ కరోనా తరువాత వస్తున్న తొలి భారీ సినిమా. తొలి వంద కోట్లకు పైగా మార్కెట్ అయిన సినిమా. ఈ…

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ విడుదల దగ్గరకు వస్తోంది. పోస్ట్ కరోనా తరువాత వస్తున్న తొలి భారీ సినిమా. తొలి వంద కోట్లకు పైగా మార్కెట్ అయిన సినిమా. ఈ సినిమాకు బజ్..క్రేజ్ కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. 

ఎందుకంటే పవన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. కానీ సినిమా విడుదలకు హడావుడి చేయాల్సిన అవసరం వుంది. 

అందుకే ఏప్రిల్ 3న యూసఫ్ గుడా గ్రౌండ్స్ లో భారీ ఫంక్షన్ చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేవలం యూనిట్ కే పరిమతం చేస్తారా? లేక మెగాస్టార్ నో మరో సూపర్ స్టార్ నో గెస్ట్ గా వస్తారా? అన్నది చూడాలి. 

ఓ క్రేజీ గెస్ట్ కోసం నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని బోగట్టా. అది సెట్ కాకుంటే కేవలం పవన్ మాత్రమే కీలకంగా వుంటారు. 

ఇటీవలి కాలంలో సోలోగా విడుదలవుతున్న సినిమా వకీల్ సాబ్ నే. ప్రతివారం మూడు సినిమాలు వుంటున్నాయి. కానీ వకీల్ సాబ్ కు నిర్మాత దిల్ రాజు కావడంతో,  గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసి పెట్టారు.

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు