ఆ సినిమా ఆగిపోయింది

జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని సినిమా ఆరంగ్రేటం అర్థాంతరంగా ఆగిపోయింది. ఏ హీరోతో.. ఏ హీరోతో అని ఎంచుకుంటూ వెళ్లి, ఆఖరికి అడవి శేష్ సరసన టూ స్టేట్స్ రీమేక్ ను ఎంచుకున్న సంగతి…

జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని సినిమా ఆరంగ్రేటం అర్థాంతరంగా ఆగిపోయింది. ఏ హీరోతో.. ఏ హీరోతో అని ఎంచుకుంటూ వెళ్లి, ఆఖరికి అడవి శేష్ సరసన టూ స్టేట్స్ రీమేక్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం దాదాపు సగం పూర్తయిన తరువాత దర్శకుడి స్టామినా మీద అనుమానం రావడంతో ప్రాజెక్టు చెట్టెక్కేసింది.

అడవి శేష్ ఇప్పుడు మరో సినిమా మీదకు వెళ్లిపోయారు. పివిపి నిర్మించే ఎవరు సినిమా మీద వర్క్ చేస్తున్నారు. తరువాత తన బాలీవుడ్ సినిమా, గూడచారి 2 సినిమాల సంగతి చూస్తారు. టూ స్టేట్స్ తెలుగు రీమేక్ ను నిర్మాత సత్యనారాయణ మంచి ఆసక్తితో స్టార్ట్ చేసారు. కానీ రాను రాను కొత్త దర్శకుడు వెంకట్ వర్క్ చూస్తుంటే అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది.

ఓ పెద్ద షెడ్యూలు చేస్తే పదిశాతం అవుట్ పుట్ కూడా రాలేదని తెలుస్తోంది. ఇక ప్రాజెక్టును ఆపేసి, మొత్తం మళ్లీ వేరే డైరక్టర్ తో చేయడమా? మానడమా? అనే డైలామాలో వుండిపోయారు. ఆ విధంగా శివాని తొలిసినిమా వ్యవహారం అర్థాంతరంగా ముగిసింది.