పరశురామ్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయంలో నాగచైతన్య!

దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ కథలో…

దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ కథలో చైతు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. 

తండ్రి పాత్రలోనూ, అటు కొడుకు పాత్రలోనూ చైతు కనిపిస్తాడట. ఇది ఒక తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అని, అలాగే ట్రెండీ లవ్ స్టొరీ కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తోంది.

ఇక త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ పైకి రాబోతుందని టాక్ నడుస్తోంది. నిజానికి ‘గీత గోవిందం’ సినిమా తర్వాత వీరి కాంబినేషన్‌ లో సినిమా రావాల్సింది. కానీ, పరశురామ్ కి సూపర్ స్టార్ తో చాన్స్ వచ్చేసరికి సర్కారు వారి పాట చిత్రం చేశాడు. 

గీతా ఆర్ట్స్ సంస్థ, పరశురామ్ – అక్కినేని నాగ చైతన్య సినిమాని నిర్మించబోతుంది అని గతంలోనే ఓ వార్త హల్ చల్ చేసింది.