ట్వీట్ల‌తో కుమ్మేసిన విజ‌య‌సాయి

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని వైఎస్సార్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి విరుచుకుప‌డ‌డంలో ముందుంటారు. ఇవాళ…

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని వైఎస్సార్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయిరెడ్డి విరుచుకుప‌డ‌డంలో ముందుంటారు. ఇవాళ మ‌రోసారి తండ్రీకొడుకుల‌పై విజ‌య‌సాయి ఘాటు ట్వీట్లు చేశారు. అవి ఏంటంటే…

“తల్లిదండ్రులు మరణిస్తే తలకొరివి పెట్టనోడివి, సోదరుణ్ణి గొలుసులతో బంధించినోడివి. లోకేష్ తాత ఎవరంటే ఖర్జూర‌నాయుడు పేరు దాచిపెట్టి ఎన్టీఆర్ అంటూ ప్రచారం చేస్తున్నోడివి. నువ్వు కుటుంబం విలువలు గురించి మాట్లాడటం ఏంటి చంబా?”

“లక్షల కోట్ల అమరావతి స్కామ్ మొదలు ఇసుక, మట్టి, లేటరైట్, పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని మందుల వరకు మాఫియా వ్యవస్థలను సృష్టించి చెదపురుగుల్లా రాష్ట్రం మీదకు వదిలిన చరిత్ర నీదే కదా గుంటనక్క నాయుడూ! దొంగే దొంగ అని అరిస్తే ఎలా?”

“నీ కరకట్ట ఇంటి దగ్గరే కృష్ణలో ఇసుక అక్రమ డ్రెడ్జింగుతో కృత్రిమ ద్వీపాల ఏర్పాటుకు అనుమతించిన కేటుగాడివి. రిక్రియేషన్ సెంటర్లు వస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చని కుల మీడియాలో రాయించావు. నువ్వు పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడటం ఏంటి అల్జైమర్స్ నాయుడూ?”

ఇలా చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ల దాడి జ‌రిగింది. విజ‌య‌సాయిరెడ్డిపై లోకేశ్‌, అయ్య‌న్న‌పాత్రుడు, బుద్ధా వెంక‌న్న‌, టీడీపీ సోష‌ల్ మీడియా త‌మ మార్క్ విమ‌ర్శ‌లు చేయ‌డం చూశాం. తాజా ఘాటు ట్వీట్ల‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు మ‌ర్యాద‌గా మాట్లాడుకునే, ట్వీట్లు చేసుకునే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు.