మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మృతి

ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు ఇంట్లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. Advertisement మాగంటి రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యం తో మృతి చెందారు. ఇటీవలే మాగంటి బాబు…

ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు ఇంట్లో మరోసారి విషాదం చోటుచేసుకుంది.

మాగంటి రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యం తో మృతి చెందారు. ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మరణించిన విషయం తెలిసిందే.

తాగుడు అలవాటును తప్పించడానికి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్.  మద్యానికి బానిస అయిన రవీంద్ర ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించిన కుటుంబ సభ్యులు.

ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి ఓ హోటల్ లో ఉన్న రవీంద్ర. బ్లడ్ వామిటింగ్ తో  హయత్ ప్యాలెస్ లో చనిపోయిన రవీంద్ర.

ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

కొంతకాలం క్రితమే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా అనారోగ్యంతో చనిపోవడం.. ఇప్పుడు ఆయన రెండో కుమారుడు రవీంద్ర కూడా తుదిశ్వాస విడవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.