చిరంజీవికి బీజేపీ ఆహ్వానం!

మెగాస్టార్ చిరంజీవికి భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రోగ్రామ్ కు ఆహ్వానం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ ముఖ్యులంతా హాజ‌ర‌య్యే ఒక కార్య‌క్ర‌మం కోసం మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది.…

మెగాస్టార్ చిరంజీవికి భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్రోగ్రామ్ కు ఆహ్వానం ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే కార్య‌క్ర‌మం అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ ముఖ్యులంతా హాజ‌ర‌య్యే ఒక కార్య‌క్ర‌మం కోసం మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. అది ఏపీలో జ‌రిగే కార్య‌క్ర‌మం. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ హాజ‌ర‌య్యే కార్య‌క్ర‌మం!

భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామరాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ హాజ‌రు కానున్నారు. జూలై నాలుగో తేదీన ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. 

ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ లో భాగంగా ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి హాజ‌రు కానున్న అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌కు ప్ర‌ముఖుల జాబితాలో చిరంజీవికి ఆహ్వానం ద‌క్కింద‌ని తెలుస్తోంది.

కేంద్ర ప‌ర్యాట‌క శాఖా మంత్రి కిష‌న్ రెడ్డి ఈ ఇన్విటేష‌న్ లెట‌ర్ ను చిరంజీవికి పంపిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో అధికారికంగా అయితే ఎలాంటి రాజ‌కీయం లేదు! అయితే ఒక‌వైపు జ‌న‌సేన‌తో బీజేపీ స్నేహం చేస్తోంది. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బీజేపీ పొత్తులో ఉంది. ఈ క్ర‌మంలో చిరంజీవికి కూడా బీజేపీ ఈ ఆహ్వానం పంప‌డంలో రాజ‌కీయ వ్యూహం ఉండ‌టంలో పెద్ద వింత లేదు.