మొన్న శర్వానంద్.. ఈసారి నాగశౌర్య

శతమానంభవతి హిట్ అయినా శ్రీనివాసకల్యాణం సినిమా సతీష్ వేగేశ్నను మళ్లీ సైడ్ ట్రాక్ లోకి లాగేసింది. శ్రీనివాసకల్యాణం ఫ్లాప్ తర్వాత ఎట్టకేలకు మరో సినిమా సిద్ధంచేశాడు ఈ దర్శకుడు. ఆ సినిమాకు ఆల్ ఈజ్…

శతమానంభవతి హిట్ అయినా శ్రీనివాసకల్యాణం సినిమా సతీష్ వేగేశ్నను మళ్లీ సైడ్ ట్రాక్ లోకి లాగేసింది. శ్రీనివాసకల్యాణం ఫ్లాప్ తర్వాత ఎట్టకేలకు మరో సినిమా సిద్ధంచేశాడు ఈ దర్శకుడు. ఆ సినిమాకు ఆల్ ఈజ్ వెల్ అనే టైటిల్ కూడా పెట్టాడు. కానీ హీరో దగ్గరకు వచ్చేసరికి మళ్లీ సమస్య ఎదురైంది.

సతీష్ రాసుకునే కథలకు స్టార్ హీరోలు దొరకడం లేదు. నిజానికి అతడు రాసుకునే కథలు అలాంటివి. ఇతడి గత చిత్రాలకు దిల్ రాజు ఉన్నాడు కాబట్టి ఈజీగా శర్వానంద్, నితిన్ లాంటి నటుల్ని తీసుకురాగలిగాడు. కానీ ఈసారి మాత్రం ఆ బాధ్యత పూర్తిగా సతీష్ పైనే పడింది. అది ఇతడికి తలకుమించిన భారంగా మారింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. తన “ఆల్ ఈజ్ వెల్” సినిమాకు నాగశౌర్యను హీరోగా తీసుకోవాలనుకుంటున్నాడట సతీష్. ప్రస్తుతం హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న నాగశౌర్య కూడా సతీష్ డైరక్షన్ లో నటించేందుకు దాదాపు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాతో పూర్తిస్థాయి బ్యానర్ గా మారబోతోంది ఆదిత్య మ్యూజిక్. గతంలో వీళ్లు ఖాకీ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ తో మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ లోకి ఎంటరవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. 

సెక్సువల్ ఫాంటసీస్.. ఎక్కువ కోరికలు ఇవేనట!

వైఎస్సార్ యాత్ర సినిమాపై డైరెక్టర్ ఏమి చెప్పారంటే