ఆది సాయికుమార్..మొదటిసారి

పలు చిత్రాలు నిర్మించిన నిర్మాత కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం క్రేజీ ఫెలో. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఆది సాయికుమార్ నే ఈ క్రేజీ ఫెలో. ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని…

పలు చిత్రాలు నిర్మించిన నిర్మాత కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం క్రేజీ ఫెలో. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఆది సాయికుమార్ నే ఈ క్రేజీ ఫెలో. ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని సరైన డేట్ కోసం చూస్తోంది. 

ఈ లోగా సినిమా మెటీరియల్ విడుదల చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా మాంచి మెలోడి సాంగ్ ను విడుదల చేసారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ స్వీట్ మెలోడీ ట్యూన్ బాగుంది.

రఘురామ్ అందించిన సాహిత్యాన్ని రమ్య బెహరా ఆలపించారు. మొదటిసారి..మనసు జారి..చెలిమి కోరి..నిన్ను చేరి అంటూ సాగింది ఈ పాట. సున్నితమైన ఆర్కెస్ట్రా తోడయింది…’ నీ రాకతో మారిందే లోకం..నచ్చేట్టుగా..నీ ధ్యాసలో కాలం సాగిందే గమ్మత్తుగా..’అంటూ పాట సాగింది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ తో పాటు, దివ్యాంగన సూర్యవంశీ, మీర్నా మీనన్, సప్తగిరి, తదితరులు నటించారు.

ఈ సినిమాకు ఫణికృష్ణ కథ, మాటలు అందిస్తూ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన రెండో పాట ఇది. రెండు వారాల క్రితం రావే..రావే నా చెలియా…నీ కోసం వేచానే నా సఖియా అనే శ్రీరామచంద్ర పాడిన పాటను విడుదల చేసారు. అది కూడా మెలోడీ టచ్ తో క్యాచీ ట్యూన్ తో సాగింది.