మరో క్రేజీ ప్రాజెక్టులో రష్మిక..!

సౌత్-నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం ముంబయికి మకాం మార్చిన ఈ బ్యూటీ, పుష్ప-2 కోసం హైదరాబాద్ వచ్చిపోతోంది. త్వరలోనే ఈమె ముంబయి నుంచి చెన్నైకి రాకపోకలు సాగించనుంది. Advertisement…

సౌత్-నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తోంది రష్మిక. ప్రస్తుతం ముంబయికి మకాం మార్చిన ఈ బ్యూటీ, పుష్ప-2 కోసం హైదరాబాద్ వచ్చిపోతోంది. త్వరలోనే ఈమె ముంబయి నుంచి చెన్నైకి రాకపోకలు సాగించనుంది.

అవును.. కోలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. విక్రమ్ హీరోగా జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రష్మిక దాదాపు హీరోయిన్ గా లాక్ అయింది.

మలయాళంలో వచ్చిన '2018' అనే సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగాడు జూడ్ ఆంటోనీ. మల్లూవుడ్ లో అత్యంత వేగంగా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన చిత్రంగా '2018' రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ డైరక్టర్, విక్రమ్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారు.

కార్తి హీరోగా నటించిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టింది రష్మిక. ఆ తర్వాత విజయ్ సరసన వారిసు సినిమా చేసింది. ఈ రెండు సినిమాలతో ఆమెకు తమిళనాట మంచి క్రేజ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా రంజితమే సాంగ్ లో రష్మిక లుక్, డాన్స్ కు తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు విక్రమ్ సినిమాతో మరోసారి కోలీవుడ్ లో అడుగుపెడుతోంది ఈ బ్యూటీ.

నిజానికి ఈ సినిమాలో రష్మిక స్థానంలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అప్పట్లో కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక, రష్మిక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే రష్మిక మాత్రం ఈ ప్రాజెక్టు వదులుకోవడానికి ఇష్టపడలేదు. తాజాగా ఈ సినిమాలోకి విజయ్ సేతుపతి కూడా చేరాడు. హీరో విక్రమ్ కు ప్రతినాయకుడి పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడు.