మెగా కాంపౌండ్ లోకి చైతూ హీరోయిన్

సవ్యసాచి ఫ్లాప్ అయినా నిధి అగర్వాల్ కెరీర్ మాత్రం జోరుగా ఉంది. ఆమెకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. సవ్యసాచి సెట్స్ పై ఉంటుండగానే మిస్టర్ మజ్నులో అవకాశం అందిపుచ్చుకున్న ఈ…

సవ్యసాచి ఫ్లాప్ అయినా నిధి అగర్వాల్ కెరీర్ మాత్రం జోరుగా ఉంది. ఆమెకు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. సవ్యసాచి సెట్స్ పై ఉంటుండగానే మిస్టర్ మజ్నులో అవకాశం అందిపుచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మెగా కాంపౌండ్ లోకి ఎంటరైంది.

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయన్ గా తీసుకున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కొత్తమ్మాయిని తీసుకుంటే, హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్త అయిపోతారు.

పోనీ ఆల్రెడీ ఉన్న హీరోయిన్ ను తీసుకుంటే, ఆమె ముందు వైష్ణవ్ జూనియర్ అయిపోతాడు. అందుకే అటుఇటు కాకుండా 2 సినిమాల అనుభవం ఉన్న నిధి అగర్వాల్ ను వరించింది ఈ అవకాశం. ఈ ఛాన్స్ తో మెల్లగా మెగా కాంపౌండ్ లో పాతుకుపోదామని చూస్తోంది నిధి.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను కూడా బయటపెట్టింది. రామ్ చరణ్, బన్నీతో కలిసి నటించాలని ఉందంటూ ప్రకటించింది. దానికి వైష్ణవ్ తేజ్ సినిమాను తొలిమెట్టుగా వాడుకోబోతోంది. సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయినా, నిధి అందాలకు మంచి మార్కులు పడ్డాయి. అక్కడక్కడ ఆమె యాక్టింగ్ కూడా బాగుంది.

సో.. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే నిధికి తెలుగులో మంచి సినిమాలు పడే అవకాశాలున్నాయి. 

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్