టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.తన వద్ద నర్సింహారెడ్డి కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్యామల్ భర్తతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
కడపకు చెందిన నర్సింహారెడ్డి పలు టీవీ సీరియళ్లలో నటించారు. శ్యామల, నర్సింహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ యాంకర్గా శ్యామలకు మంచి గుర్తింపు ఉంది. మరీ ముఖ్యంగా బిగ్బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్గా పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరకు సంబంధించిన సెలబ్రిటీ అరెస్ట్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అరెస్ట్కు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
2017లో నర్సింహారెడ్డి తన వద్ద కోటి రూపాయలు తీసుకన్నాడని, తిరిగి ఆ సొమ్మును చెల్లించకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
నర్సింహారెడ్డి తరపున ఓ మహిళ రంగంలోకి దిగి సెటిల్ చేసుకోవాలని రాయభారం నడిపింది. అయితే ఇవేవీ వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో నర్సింహా రెడ్డితో పాటు మధ్యవర్తిత్వం నడిపిన మహిళను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.