ఆచార్యకు ఇంకా 10 రోజులు మాత్రమే కావాలి

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆగస్ట్ లో కొత్త రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే విషయం కూడా 2 రోజులుగా తిరుగుతోంది.  Advertisement ఇప్పుడిదే విషయాన్ని అధికారికంగా…

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆగస్ట్ లో కొత్త రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే విషయం కూడా 2 రోజులుగా తిరుగుతోంది. 

ఇప్పుడిదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆచార్య సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందనే విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఇంతకుముందు చెప్పినట్టు మే 13కు రావడం లేదు. మళ్లీ ఎప్పుడు రిలీజౌతుందనే విషయాన్ని చెప్పలేదు.

ఆచార్య సెట్స్ లో కరోనా కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. ముందుగా నటుడు సోనూ సూద్ కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పూజా హెగ్డే కు కూడా కరోనా సోకింది. సోనూకు వైరస్ సోకినప్పుడే చిరంజీవి, చరణ్ లాంటి కీలకమైన సభ్యులంతా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అలా ఆగిపోయిన ఆచార్య షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనేది ఎవ్వరికీ క్లారిటీ లేదు. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుందనగా, ఊహించని విధంగా షూటింగ్ నిలిచిపోయింది.

పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఆ 10 రోజుల షూటింగ్ ను పూర్తిచేసి, అప్పుడు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. గతేడాది కరోనా వ్యాప్తి చెందినప్పుడు ఓసారి ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు సెకెండ్ వేవ్ లో కూడా సినిమా మరోసారి ఆగిపోయింది.