టీడీపీ జిల్లా పెద్దకే బిగ్ షాక్…?

తెలుగుదేశం పార్టీకి రోజులు బాగులేనట్లుగా ఉన్నాయి. లేకపోతే ఒక వైపు ఆ పార్టీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. మరో వైపు యధా ప్రకారం అక్రమ నిర్మాణాల మీద సర్కార్ వారి గునపం అడ్డంగా…

తెలుగుదేశం పార్టీకి రోజులు బాగులేనట్లుగా ఉన్నాయి. లేకపోతే ఒక వైపు ఆ పార్టీ నేతల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. మరో వైపు యధా ప్రకారం అక్రమ నిర్మాణాల మీద సర్కార్ వారి గునపం అడ్డంగా దిగిపోతోంది.

విశాఖలో అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల భవనం నిర్మించారని పేర్కొంటూ జీవీఎంసీ అధికారులు ఏకంగా విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని సడెన్ గా కూలగొట్టారు. దీని మీద ఎలాంటి నోటీసులు లేకుండా కూలగొట్టారని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. 

ఇదిలా ఉంటే అక్రమ నిర్మాణాల విషయంలో గతంలో దూకుడుగా వ్యవహరించిన జీవీఎంసీ మరో మారు కొరడా ఝలిపించడంతో ఇపుడు చాలా మంది అక్రమార్కుల గుండెళ్ళో ఒక్కసారిగా  రైళ్ళు పరిగెడుతున్నారు.

గతంలో కూడా టీడీపీకి చెందిన వారి అక్రమ కట్టడాలను కూల్చేశారు. అయితే వీకెండ్ ఆపరేషన్ పేరిట ఇలా కూల్చేయడమేంటని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 

మొత్తానికి ఎవరేమనుకున్నా అక్రమాన్ని సక్రమం అని చెప్పలేరు కదా అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి విశాఖలోని పల్లా భవనం కూల్చివేతతో మళ్లీ కూల్చుడు షురూ అయిందని అంటున్నారు. చూడాలి ఈ మలి విడత ఆపరేషన్ లో ఎన్ని భవనాలు నేలకొరుగుతాయో.