‘చిత్రమ్’ సీక్వెల్ పై ఫిర్యాదు?

ప్రేమకథాచిత్రమ్.. డైరక్టర్ మారుతి కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా విడుదలై, విజయం సాధించిన తరువాత కొన్ని వివాదాలు నడిచాయి. అవన్నీ ఆ సినిమాకు అసలు డైరక్టర్ ఎవరు? అన్న దానిమీద. సరే…

ప్రేమకథాచిత్రమ్.. డైరక్టర్ మారుతి కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా విడుదలై, విజయం సాధించిన తరువాత కొన్ని వివాదాలు నడిచాయి. అవన్నీ ఆ సినిమాకు అసలు డైరక్టర్ ఎవరు? అన్న దానిమీద. సరే అవన్నీ అయిపోయాయి. సినిమా విడుదలై చాలా ఏళ్లు దాటింది.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు తొలిభాగం నిర్మాత సుదర్శన్ రెడ్డి. ఆయన ఆ మధ్య జక్కన్న అనే సినిమా సునీల్ తో తీసి, చేతులు ఫుల్ గా కాల్చుకున్నారు. ఏదో ఇప్పటికి ఆ గాయాలు మారి, మళ్లీ ఈ సీక్వెల్ స్టార్ట్ చేసి, దాదాపు ఫినిష్ చేసారు.

కానీ ఇప్పుడు దీని మీద కూడా వివాదాలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. తన అనుమతి లేకుండా సీక్వెల్ ఎలా చేస్తారని, తొలి భాగానికి కథ, మాటలు సమకూర్చిన దర్శకుడు మారుతి అభ్యంతరం చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆయన ఛాంబర్ మెట్లు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరేం అవుతుందో?