జగన్ రక్తబంధానికి భారీ కితాబు

జగన్ తో వైసీపీ కార్యకర్తలకు ఉన్న బంధం అనిర్వచనీయం. జగన్ అంటే వారు ఎంతగానే ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఒక విధంగా అది రక్తబంధం కంటే చిక్కనిదీ, ఎవరికీ దక్కనిదీ. Advertisement అందుకే గత ఏడాది…

జగన్ తో వైసీపీ కార్యకర్తలకు ఉన్న బంధం అనిర్వచనీయం. జగన్ అంటే వారు ఎంతగానే ప్రేమాభిమానాలు చూపిస్తారు. ఒక విధంగా అది రక్తబంధం కంటే చిక్కనిదీ, ఎవరికీ దక్కనిదీ.

అందుకే గత ఏడాది డిసెంబర్ 21న జరిగిన జగన్ బర్త్ డే వేళ విశాఖలో ఏకంగా 1027 బ్లడ్ యూనిట్లను కేవీయార్ గ్రూప్ సహకారంతో సేకరించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని చేసి మరీ సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని సత్కరించింది. ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవసరమైన రక్తం అందించి వైసీపీ కార్యకర్తలు మేలు చేశారని రోటరీ ప్రతినిధులు కొనియాడారు.

ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలకు స్పూర్తిదాయకంగా కూడా ఈ కార్యక్రమం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని కొనసాగిస్తే ఆపదలో ఉన్న వారికి రక్తదానం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇదే వైద్య ప్రముఖులు చెబుతూ వైసీపీ క్యాడర్ ని ప్రశంసిస్తున్నారు.