తమ్ముళ్ళు ఫుల్ హ్యాపీసట..!

తమ్ముళ్ళకు తాము అధికారలో లేకపోయినా కూడా ఇపుడు ఆనందంగా ఉందిట. తమ వల్ల కానిది వైసీపీ  సర్కార్ చేస్తున్నందుకు పరమానందంగా  ఉందిట. విశాఖ రాజధాని విషయంలో తమ్ముళ్ళది మహదానందమని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు.…

తమ్ముళ్ళకు తాము అధికారలో లేకపోయినా కూడా ఇపుడు ఆనందంగా ఉందిట. తమ వల్ల కానిది వైసీపీ  సర్కార్ చేస్తున్నందుకు పరమానందంగా  ఉందిట. విశాఖ రాజధాని విషయంలో తమ్ముళ్ళది మహదానందమని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే  వారు బయటకు చెప్పుకోలేని నిస్సహాయతతో ఉన్నారని  అవంతి అంటున్నారు

రాజధాని విశాఖలో ఎపుడెపుడు వస్తుందా అని తమ్ముళ్ళే అందరి కంటే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తున్నారని ఆయన లోగుట్టు బయటపెట్టారు. పైకి మాత్రం బింకంగా విశాఖలో రాజధాని వద్దు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న తమ్ముళ్ళు లోపల మాత్రం ఎంత తొందరగా విశాఖకు రాజధాని వస్తే అంత బాగుండు అనుకుంటున్నారుట.

దానికి కారణం విశాఖలో తమ్ముళ్ళకు ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు, పెట్టుబడులు ఉన్నాయని అవంతి అంటున్నారు. అందువల్ల రాజధాని వస్తే మొదట బాగుపడేది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారేనని కూడా ఆయన సెటైర్లు వేస్తున్నారు.

తాము అధికారంలో ఉన్నపుడు కనీసం విశాఖను రాజధానిగా పరిశీలించమని అడగడానికి దమ్ము లేని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇపుడు పెద్ద నోరు చేసుకుని జగన్ మీద బాణాలు వేయడమేంటని కూడా అవంతి మండిపడుతున్నారు.

విశాఖ రాజధాని వద్దని యాగీ చేస్తున్న వారంతా ఉత్తరాంధ్రా ద్రోహులేనని కూడా అంటున్నారు ఇక రాజధాని రావడం తధ్యమని, ఆ విషయంలో రెండో మాట కూడా లేదని అవంతి నొక్కి వక్కానిస్తున్నారు. మొత్తానికి వైసీపీ సర్కార్ లో కూడా తమ్ముళ్ళకు బాగానే మేలు జరుగుతోందన్నమాట.

13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు