ఆన్ లైన్ బాధితులు: నిన్న శోభిత.. ఈరోజు కృతి

మహేష్ కు రెస్పెక్ట్ ఇవ్వలేదంటూ నిన్నటికి నిన్న శోభిత ధూళిపాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు అతడి అభిమానులు. ఇప్పుడు అలాంటిదే మరో చేదు అనుభవం మహేష్ హీరోయిన్ కృతి సనన్ కు ఎదురైంది.…

మహేష్ కు రెస్పెక్ట్ ఇవ్వలేదంటూ నిన్నటికి నిన్న శోభిత ధూళిపాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు అతడి అభిమానులు. ఇప్పుడు అలాంటిదే మరో చేదు అనుభవం మహేష్ హీరోయిన్ కృతి సనన్ కు ఎదురైంది. ఫొటోషూట్ కోసం ఇచ్చిన ఓ పోజు ఇప్పుడు కృతిని ఇరకాటంలో పడేసింది. 

ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ లో పాల్గొంది కృతి సనన్. వేసుకున్న డ్రెస్, పూసుకున్న మేకప్ అన్నీ బాగున్నాయి. కానీ బ్యాక్ డ్రాప్ లో చూపించిన జిరాఫీ మాత్రం నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఓ జిరాఫీ బొమ్మను గాల్లో వేలాడదీసి, ఆ బ్యాక్ డ్రాప్ లో ఫొటో షూట్ చేశారు. 

ఈ ఫొటోకు మహిళల వేధింపులకు సంబంధించిన క్యాప్షన్ పెట్టి వదిలారు. దీంతో ఈ స్టిల్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. మహిళల వేధింపుల గురించి మాట్లాడుతూ, జంతువుల్ని హింసించే ఫొటోల్ని చూపించడం ఏంటంటూ సదరు పత్రికతో పాటు కృతి సనన్ పై చాలామంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

సదరు పత్రికకు బుద్ధి లేకపోతే పోయే, కృతికి అయినా బుద్ధి ఉండాలి కదా అంటూ చాలామంది నేరుగా ఆమెను తిట్టిపోస్తున్నారు. నిన్న సాయంత్రం పెట్టిన ఈ ఫొటోపై కొంతమంది ఫిర్యాదు చేస్తామని కూడా బెదిరించారు.