థ్రిల్లర్ బాటలో గోపీచంద్

హీరోలు హీరోయిజం చుట్టూ తిరుగుతాం అంటే జనాలు పక్కన పెడుతున్న రోజులు ఇవి. కొత్తగా ఏమన్నా ట్రయ్ చేయకపోతే నిలబడడం కష్టం అవుతోంది. అందుకే కమర్షియల్ హీరోలు కూడా ఏదో ఒకటి కొత్తగా చేయాలని…

హీరోలు హీరోయిజం చుట్టూ తిరుగుతాం అంటే జనాలు పక్కన పెడుతున్న రోజులు ఇవి. కొత్తగా ఏమన్నా ట్రయ్ చేయకపోతే నిలబడడం కష్టం అవుతోంది. అందుకే కమర్షియల్ హీరోలు కూడా ఏదో ఒకటి కొత్తగా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లూ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ రివెంజ్ ఫార్ములాలు పట్టుకుని వేలాడుతున్న హీరో గోపీచంద్ కూడా మారుతున్నాడు.

ఇటీవల పంతం అనే సినిమా చేసిన ఈ హీరో లేటెస్ట్ గా ఓ థ్రిల్లర్ ను అటెంప్ట్ చేస్తున్నాడు. అయితే థ్రిల్లర్ తో పాటే కాస్త లవ్ కూడా టచ్ చేస్తారు. కొత్త దర్శకుడు కుమార్ (క్యారెక్టర్ నాగినీడు అన్నకొడుకు)తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో వర్క్ చేసిన కుమార్ తయారుచేసిన ఓ మాంచి థ్రిల్లర్ కథను గోపీచంద్ ఓకే చేసాడు. ఈనెలలో ముహుర్తం చేసుకుని నవంబర్ కు ఫినిష్ చేస్తారు.

ఇదిలా వుంటే ఈ సినిమాకు హీరోయిన్ ఇంకా సెట్ కాలేదు. పాపం, తను ఒక్కడూ వుంటే పుల్లింగ్ సరిపోదని, మాంచి సేలబుల్ హీరోయిన్ వుంటే బెటర్ అని గోపీచంద్ భావిస్తున్నట్లు బోగట్టా. అందుకోసం కాజల్ అయితే బెటర్ అని అనుకుంటున్నారు. కానీ ఆమె ఓకె అనడం లేదని తెలుస్తోంది. కానీ కథ ప్రకారం కాస్త కొత్త అమ్మాయి అయితే బెటర్ అని తెలుస్తోంది. కానీ దానికి హీరో ఓకె అనడంలేదు. ఈ వ్యవహారాన్ని ముహుర్తం లోగా ముగిస్తారు.