నేడో రేపో సవ్యసాచి క్లారిటీ

అన్నీ అనుకున్నట్లు జరిగివుంటే ఈ పాటికి శైలజారెడ్డి టీజర్ బయటకు వచ్చేంది. కానీ నాగచైతన్యతో మైత్రీ మూవీస్ మీటింగ్ లు తెమలడం లేదు. చైతూ ఏ నిర్ణయం కచ్చితంగా చెప్పలేకపోవడం అలాగే నడుస్తోంది. దీంతో…

అన్నీ అనుకున్నట్లు జరిగివుంటే ఈ పాటికి శైలజారెడ్డి టీజర్ బయటకు వచ్చేంది. కానీ నాగచైతన్యతో మైత్రీ మూవీస్ మీటింగ్ లు తెమలడం లేదు. చైతూ ఏ నిర్ణయం కచ్చితంగా చెప్పలేకపోవడం అలాగే నడుస్తోంది. దీంతో శైలజారెడ్డి టీజర్ ను పక్కనపెట్టారు. బహుశా 31న విడుదలయ్యే అవకాశం వుందని వినికిడి.

ఎప్పుడో మొదలు పెట్టి, ఇప్పటికీ సవ్యసాచి పూర్తి చేసుకోకపోవడం అన్నది డైరక్టర్, నిర్మాతల సమస్య. అదే విషయం వెల్లడించి, దాని కారణంగా శైలజారెడ్డి అల్లుడు ముందు వచ్చే అవకాశం వుందని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఇదే మైత్రీ మూవీస్ ను కలవరపెడుతోందట. తమకు వెనక్కు వెళ్లడానికి అభ్యంతరం లేదని, కానీ అలావెళ్తే, మీడియా వార్తలు నిజం చేసినట్లు వుండడమే కాదు, తాము ఓడిపోయినట్లు వస్తుందని అంటున్నారట.

మీడియాలో వార్తలు శైలజారెడ్డి అల్లుడు యూనిట్ పుట్టించినవే అని, ఇప్పుడు వెనక్కు వెళ్తే, మీడియాలో వచ్చినట్లు తాము ఓడిపోయినట్లుగా అవుతుందని మైత్రీజనాలు అంటున్నారట. ఆఖరికి ఏదో విధంగా మైత్రీ జనాలకు చైతన్య నచ్చ చెప్పినట్లు బోగట్టా.

బహుశా సోమ మంగళవారాల్లో సవ్యసాచి యూనిట్ నుంచి క్లారిటీ వస్తుంది. సవ్యసాచి విడుదల డేట్ మీద. ఆ తరువాత శైలజారెడ్డి అల్లుడు సినిమా డేట్ అనౌన్స్ మెంట్, టీజర్ అనౌన్స్ మెంట్ వస్తాయి.

నాగచైతన్య ఒకేసారి ఫన్ ఎంటర్ టైనర్, యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేయడం, ఆ రెండూ కూడా సమాంతరంగా చేయడం విశేషం. ఈ సమాంతరంగా చేయడం అనేదే సమస్యగా మారింది.  రెండూ పెద్ద బ్యానర్లు కావడంతో, ఎవర్నీ కాదనలేక, ఎవరికీ చెప్పలేక చైతన్య చాలా ఇబ్బందులు పడుతున్నాడు మరి.