తేజ్-గోపీచంద్ సినిమా లేనట్లేనా?

ఇంటిలిజెంట్ సినిమా టైమ్ నుంచి వినిపించిన కాంబినేషన్ సాయిధరమ్ తేజ-గోపీచంద్ మలినేని. కానీ ఈ కాంబినేషన్ ఇప్పట్లో మెటీరియలైజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంటిలిజెంట్ తరువాత కరుణాకరన్ సినిమా మీదకు వెళ్లాడు. ఆ…

ఇంటిలిజెంట్ సినిమా టైమ్ నుంచి వినిపించిన కాంబినేషన్ సాయిధరమ్ తేజ-గోపీచంద్ మలినేని. కానీ ఈ కాంబినేషన్ ఇప్పట్లో మెటీరియలైజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంటిలిజెంట్ తరువాత కరుణాకరన్ సినిమా మీదకు వెళ్లాడు. ఆ తరువాత అనుకోకుండా మైత్రీమూవీస్ – కిషోర్ తిరుమల సినిమా చేస్తున్నాడు. 

పోనీ ఆ సినిమా తరువాత చేస్తాడేమో అనుకుంటే, అది కూడా లేదని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ సినిమా తరువాత మళ్లీ టాగోర్ మధు బ్యానర్ లో సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. గోపాల్ అనే ఓ కొత్త దర్శకుడు అందించిన స్క్రిప్ట్ పై ఇప్పుడు కిందామీదా అవుతున్నారు.  ఆ లైన్ ను అయితే సూత్ర ప్రాయంగా తేజ్ ఓకె చేసాడు. 

కానీ పూర్తి సంతృప్తి కరమైన స్క్రిప్ట్ తయారయ్యాకే ప్రాజెక్టు ఓకె అవుతుంది. ఈ సినిమాకు టైటిల్ ను మాత్రం రిజిస్టర్ చేయించారు. భగవద్గీత సాక్షిగా… అనేది టైటిల్. విజయవాడ నేపథ్యంలో జరిగే కథగా తెలుస్తోంది.

ఇదికాక, గీతాలో ఓ సినిమా తేజ్ చేయాల్సి వుంది. అందువల్ల గోపీచంద్ మలినేని సినిమా లేనట్లే అని అనుకోవాల్సి వస్తోంది.