చిన్నమ్మ మీద విజయసాయి సెటైర్లు అదరహో…!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యుద్ధం ప్రకటించేశారు. ప్రతీ రోజూ ఆయన ట్విట్టర్ పురంధేశ్వరి మీద కామెంట్స్ చేసుకుంటూ పోతోంది. ఒక విధంగా చూస్తే…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యుద్ధం ప్రకటించేశారు. ప్రతీ రోజూ ఆయన ట్విట్టర్ పురంధేశ్వరి మీద కామెంట్స్ చేసుకుంటూ పోతోంది. ఒక విధంగా చూస్తే ఆమెకు ఎక్కడా గుక్క తిప్పుకోనీయకుండా చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేస్తున్నారు.

బీజేపీ తరఫున 2019 ఎన్నికల్లో పురంధేశ్వరి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆమెకు ఆనాడు వచ్చిన ఓట్లు 33, 892. అయితే ఈ ఓట్లు కూడా నోటా కంతే కొద్దిగా ఎక్కువ వచ్చాయంతే అని విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ చిన్నమ్మకు షాక్ ఇచ్చేలాగానే ఉంది మరి.

విశాఖలో మొత్తం ఇరవై దాకా పోలింగ్ బూతులలో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడలేదని మరో నలభై నుంచి యాభై పోలింగ్ బూతులలో చూస్తే పది లోపే ఓట్లు వచ్చాయని విజయసాయిరెడ్డి మొత్తం ఓట్ల గుట్టు బయటపెట్టారు.

ఇంతలా పెర్ఫార్మ్ చేసినందుకేనా పురంధేశ్వరికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన ఆమెను తీసుకొచ్చి రాష్ట్ర బీజేపీ పీఠం అప్ప‌గించారు అంటే కమలం పార్టీ అధినేతలు పెద్ద సాహసమే చేశారు అని వైసీపీ ఎంపీ సెటైర్లు పేల్చారు.

ఆయనే మరో ట్వీట్ లో అయితే పురంధేశ్వరికి కలసివచ్చినట్లుగా రాజకీయ అదృష్టం అందరికీ కలసి రావాలి కదా అని కూడా అంటున్నారు. పురంధేశ్వరి ఓటమి గురించి ఇలా సెటైర్లు పేల్చి ఆమెతో పాటు బీజేపీని ఇబ్బందులో పడేశారు విజయసాయిరెడ్డి. దీనికి బీజేపీ నేతలు ఏమంటారో.