సీఐడీ ఆఫీసర్ గా సూపర్ స్టార్

మహేష్ మూవీ కోసం సుకుమార్ ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్, సరికొత్త జానర్ లో కథ వండుతున్నట్టు సుకుమార్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడా…

మహేష్ మూవీ కోసం సుకుమార్ ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహేష్ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్, సరికొత్త జానర్ లో కథ వండుతున్నట్టు సుకుమార్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడా స్టోరీలైన్ ఏంటనే విషయంపై చిన్నచిన్న లీకులు వస్తున్నాయి.

ప్రస్తుతం ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, మహేష్ బాబు-సుకుమార్ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోందట. ఇందులో సీఐడీ ఆఫీసర్ గా మహేష్ కనిపించనున్నాడట. సుకుమార్ చెప్పిన 2-3 స్టోరీలైన్స్ లో ఈ కథకే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ క్రైమ్ థ్రిల్లర్ కు సంబంధించి మహేష్ బాబు లుక్, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనే విషయంపై ఫుల్ క్లారిటీతో ఉన్నాడట సుకుమార్. నిజానికి కథ కంటే ముందు ఈ క్యారెక్టరైజేషన్ నే ముందుగా మహేష్ కు నెరేట్ చేశాడట.

రంగస్థలం విషయంలో కూడా సుకుమార్ అదే పని చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని, హీరో చెవిటివాడు అనే విషయాన్ని మాత్రమే ముందుగా చరణ్ కు చెప్పాడు. చెర్రీ ఓకే చెప్పిన తర్వాతే స్టోరీ డెవలప్ చేశాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు సుక్కూ.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రానుంది మహేష్-సుకుమార్ సినిమా. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.