పవన్‌కు మసాజ్ పిచ్చి, అమ్మాయిలతో!

జనసేన అధిపతి, సినీ హీరో పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణ చేసింది జూనియర్ ఆర్టిస్టు శృతి. ఇండస్ట్రీలో అమ్మాయిలపై లైంగిక వేధింపులపై జరిగిన సమావేశంలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలే చేసింది. సినీ హీరోగా…

జనసేన అధిపతి, సినీ హీరో పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణ చేసింది జూనియర్ ఆర్టిస్టు శృతి. ఇండస్ట్రీలో అమ్మాయిలపై లైంగిక వేధింపులపై జరిగిన సమావేశంలో ఆమె ఈ సంచలన వ్యాఖ్యలే చేసింది. సినీ హీరోగా స్టార్ ఇమేజ్‌తో రాజకీయాల్లోకి ఎంటరైన పవన్ కల్యాణ్‌ గురించి ఆమె సంచలన విషయాలను ప్రస్తావించింది.

ఒకవైపు ఇండస్ట్రీలో తమ బోటి వాళ్లపై జరుగుతున్న అన్యాయాల విషయంలో స్పందించలేని పవన్ కల్యాణ్, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు అన్నట్టుగా శ్రీరెడ్డి లాంటి వాళ్లు వ్యాఖ్యానిస్తుండగా, ఇప్పుడు పవన్ పై శృతి ఆరోపణ గమ్మత్తుగా ఉంది. పవన్ కల్యాణ్‌కు మసాజ్ పిచ్చి అని అంటోంది శృతి.

అది కూడా అమ్మాయిలతో, అందునా బెంగాళీ అమ్మాయిలతో మసాజ్ చేయించుకోవడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడతాడని ఈమె చెప్పుకొచ్చింది. బహిరంగంగానే ఈ వ్యాఖ్యలు చేసింది. అలాంటి పవన్ కల్యాణ్ తమ సమస్యల గురించి ఏదో చేస్తాడనే నమ్మకం లేదని ఈ జూనియర్ ఆర్టిస్టు అంటోంది.

పవన్ కల్యాణ్‌ అమ్మాయిలతో మసాజ్ చేయించుకునే వ్యవహారంపై బహిరంగ చర్చకు సవాల్ అని, ఈ విషయంలో ఎవరు ముందుకు వచ్చినా తను మాట్లాడతాను అని ఈ జూనియర్ ఆర్టిస్టు వ్యాఖ్యానించింది. ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చి జనోద్ధరణ గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ గురించి ఒక జూనియర్ ఆర్టిస్టు ఇలా మాట్లాడటం విశేషమే.

అలాగే శ్రీరెడ్డి కూడా పవన్ పై ఘాటుగా స్పంధించిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులను ఎదుర్కొన్న శ్రీరెడ్డి తనను వేధించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందని పవన్ ఉచిత సలహా ఇవ్వగా, ఆమె ఘాటుగా స్పందించింది. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అంటున్న పవన్ కల్యాణ్ ఈ విషయం మీద కూడా ఏ స్టేషన్లోనో కోర్టులోనో ఫిర్యాదు చేయకుండా పోరాడతాను అని ఎందుకంటున్నాడు? అని శ్రీరెడ్డి లాజికల్‌గా కొశ్చన్ చేసింది.