నాగ్ పాటకు చైతూ డ్యాన్స్

సినిమాలో నటనను వారసత్వంగా ఎలా తీసుకుంటున్నారో, పాటల రీమిక్స్ కూడా అదే బాపతు. ఏ హీరో ఆ హీరో ఫాదర్ వో, అన్నవో, మామయ్యవో పాటలు తీసుకుని రీమిక్స్ చేయడం కామన్ అయింది. ఇప్పుడు…

సినిమాలో నటనను వారసత్వంగా ఎలా తీసుకుంటున్నారో, పాటల రీమిక్స్ కూడా అదే బాపతు. ఏ హీరో ఆ హీరో ఫాదర్ వో, అన్నవో, మామయ్యవో పాటలు తీసుకుని రీమిక్స్ చేయడం కామన్ అయింది. ఇప్పుడు ఇదే కోవలో నాగచైతన్య కూడా ఓ సాంగ్ చేయబోతున్నాడు. సీనియర్ హీరో నాగార్జున చేసిన హిట్ సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారు.

సక్సెస్ ఫుల్ డైరక్టర్ చందు మొండేటి, సక్సెస్ ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీస్ కలిసి అందిస్తున్న సవ్యసాచి సినిమా కోసం నాగ్ అలనాటి సూపర్ హిట్.. 'నిన్ను రోడ్ మీద చూసినది లగాయత్తు' అన్న పాటను రీమిక్స్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడ చిన్న గమ్మత్తు ఏమిటంటే, అప్పట్లో ఆ పాటను అందించిన కీరవాణినే ఇప్పుడు మళ్లీ రీమిక్స్ చేయడం విశేషం.

నిజానికి ఈ పాట ట్యూన్ కూడా కీరవాణిదే అనుకోవడానికి లేదు. ఈ పాట స్టయిల్.. అలనాటి బాలీవుడ్ సూపర్ హిట్ ఆరాధన లోని.. మేరీ స్వప్నోంకి రాణీ.. అనే పాట ట్యూన్ ను పోలి వుంటుంది ఈ ‘నిన్ను రోడ్ మీద చూసినది లగాయత్తు’ అన్న పాట. ఇంకో విషయం ఏమిటంటే ఈ పాట పాడడంలో, లగాయత్తు అన్న పదం ఇంకోలా ధ్వనించేలా పాడించడం విశేషం. నాగ్ కెరీర్ లో బెస్ట్ మాస్ సాంగ్స్ లో ఇదోటి. అందుకే ఇప్పుడు ఈపాటను నాగచైతన్యతో రీమిక్స్ చేస్తున్నారు.

ఈ పాట కోసం స్పెషల్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఆమె సెట్ కాకపోతే కాజల్ ను ఆల్టర్ నేటివ్ గా అనుకుంటున్నారు. సవ్యసాచి సినిమా జూలైలో విడుదలవుతుంది.