నాటి ప్రేమ… హీరో, హీరోయిన్‌కు నేడు తలనొప్పి!

ఎప్పుడో టాడా కేసులో సంజయ్‌ దత్‌ జైలుకు వెళ్లేనాటికి అతడు మాధురితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉండేవాడని అంటారు. అప్పటికే బ్యాడ్‌బాయ్‌గా పేర్గాంచిన హీరోగా సంజయ్‌ దత్‌కు ఉన్న బీభత్సమైన క్రేజ్‌ ఉండేది. దీంతో…

ఎప్పుడో టాడా కేసులో సంజయ్‌ దత్‌ జైలుకు వెళ్లేనాటికి అతడు మాధురితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉండేవాడని అంటారు. అప్పటికే బ్యాడ్‌బాయ్‌గా పేర్గాంచిన హీరోగా సంజయ్‌ దత్‌కు ఉన్న బీభత్సమైన క్రేజ్‌ ఉండేది. దీంతో అతడికి స్టార్‌ హీరోయిన్లు పడిపోవడం పెద్ద విషయం కాదు. అలాగే మాధురి పడిపోయిందని అంటారు. నాడు ఏం జరిగిందో ఏమోకానీ.. ఇప్పుడు మాత్రం అటు మాధురికి, ఇటు దత్‌కు నాటి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడిప్పుడు అదో పెద్ద ఇష్యూ అవుతోంది.

ఈ మధ్యనే సంజయ్‌ దత్‌ బయోగ్రఫీ ఒకటి తెరపైకి వచ్చింది. అది దత్‌ అనుమతి లేకుండానే రాశారట. అందులో అయితే మాధురితో ఈ హీరో ప్రేమవ్యవహారంపై డైరెక్టుగా రాసేశారు. దత్‌ ఆమెను పిచ్చిగా ప్రేమించాడని, ఆ ప్రేమతో భార్యను నిర్లక్ష్యం చేశాడని, అప్పటికే భార్య క్యాన్సర్‌ బాధితురాలు కావడంతో ఆమెపై ఆ వ్యాధి ప్రభావం మరింత ముదిరి చనిపోయిందని రాశారు. అందరి ముందునా సంజయ్‌దత్‌ మాధురిపై ప్రేమను వ్యక్తీకిరించే వాడని కూడా పేర్కొన్నారు. మాధురి కూడా దత్‌కు పడిపోయిందని పేర్కొన్నారు.

ఆ బయోగ్రఫీపై దత్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశాడు. అసలు ఎవరిని అడిగి తన జీవితం గురించి రాశారు? అని దత్‌ విరుచుకుపడ్డాడు కూడా. వాళ్లపై పరువునష్టం దావా వేస్తానని ఈ హీరో ప్రకటించాడు. ఒకవైపు మాధురి పెళ్లి చేసేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. ఇక దత్‌ కూడా ప్రస్తుతం హ్యాపీగా మ్యారిడ్‌ లైఫ్‌లో ఉన్నాడు. ఇతడికీ ఇద్దరు పిల్లలు. ఇలా హ్యాపీగా ఉన్నారనుకుంటే.. ఇప్పుడు పాత గాయాలను బయటివాళ్లు కెళుకుతున్నారు.

కేవలం బయోగ్రఫీ పుస్తకమే కాదు.. మరోరకంగా ఇప్పుడు మాధురి, దత్‌ల లవ్‌ చర్చలోకి వచ్చింది. సంజయ్‌ దత్‌ను ప్రధాన పాత్రలో పెట్టి 1940 పరిణామాల మధ్యన ఒక సినిమా తీద్దామని కరణ్‌ జోహార్‌ అనుకున్నాడు. అందులో దత్‌ సరసన శ్రీదేవిని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆమె హఠాన్మరణం పాలయ్యారు. ఆమె చనిపోవడంతో.. కరణ్‌ ఆ స్థానంలోకి మాధురీ దీక్షిత్‌ను తీసుకున్నాడు. ఇలా దశాబ్దాల తర్వాత మాధురి, దత్‌లు జతకట్టబోతున్నారని మీడియా విశ్లేషణలు మొదలుపెట్టింది.

ఇటీవలే ఈ అంశం గురించి సంజయ్‌ దత్‌తో ప్రస్తావించగా ఆయనకు కోపం వచ్చింది. దశాబ్దాల తర్వాత మాధురితో కలిసి నటించబోతున్నారు కదా.. అని దత్‌ను అడుగగానే, ఆయన కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. అంత వరకూ కూల్‌గా మాట్లాడిన దత్‌ మాధురి పేరెత్తగానే తీవ్రమైన ఆగ్రహంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మాధురి గురించి తను మాట్లాడను, ఆ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అన్నట్టుగా దత్‌ రియాక్షన్‌ ఇచ్చాడు.

మరి దీన్నిబట్టి మాధురితో కలిసి నటించడం కూడా ఇప్పుడు దత్‌కు ఇష్టం లేనట్టుగానే ఉందని.. ఈ సినిమా నుంచి కూడా ఆయన తప్పుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. దత్‌ తప్పుకుంటే అనిల్‌ కపూర్‌ను ఆ పాత్రలోకి తీసుకోవాలని అనుకుంటున్నాడట కరణ్‌ జోహార్‌ కూడా.