రంగస్థలం సెకండాఫ్ బోయపాటి?

మరో కొద్ది రోజులు మాత్రమే వుంది రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన రంగస్థలం సినిమా తెరపైకి రావడానికి. ఈ సినిమాపైనే వుంది ఇప్పుడు జనం దృష్టి అంతా. అందుకే బోలెడు…

మరో కొద్ది రోజులు మాత్రమే వుంది రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన రంగస్థలం సినిమా తెరపైకి రావడానికి. ఈ సినిమాపైనే వుంది ఇప్పుడు జనం దృష్టి అంతా. అందుకే బోలెడు కబుర్లు వినిపిస్తున్నాయి రంగస్థలం సినిమా గురించి.

సాధారణంగా దర్శకుడు సుకుమార్ సినిమాలు సున్నితంగా వుంటాయి. అది వన్ అయినా, నాన్నకు ప్రేమతో అయినా, యాక్షన్ సీన్లు వున్నా కూడా నెత్తురు ఓడడం, కత్తులు వాడడం వుండదు. అయితే రంగస్థలం అసలు సుకుమార్ కెరీర్ లోనే డిఫరెంట్ గా వుంటుందని తెలుస్తోంది.

తొలిసగం పూర్తిగా ఎంటర్ టైన్ మెంట్ తో, నవ్వులు పూయిస్తూ, పూర్తి ఫన్ తో వుంటుందట. కానీ వన్స్ సెకండాఫ్ వచ్చాక ఎమోషన్లు పీక్స్ లో వుంటాయట. అచ్చం బోయపాటి సినిమాలో ఎమోషన్లు ఏ విధంగా పీక్ స్టేజ్ లో వుంటాయో అలా వుంటాయని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు. యాక్షన్ సీన్లు కూడా చాలా బీభత్సంగా వుంటాయని తెలుస్తోంది. అవి కూడా బోయపాటి సినిమా రేంజ్ లో వుంటాయట.

అంటే ఈసారి సుకుమార్ పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నారన్నమాట. ఇదిలా వుంటే ఈ సినిమాలో అనసూయది చాలా కీలమైన పాత్ర అంట. సినిమా చివర్లో ఆమె పాత్రనే కీలకం అయవుతుందని టాక్ వినిపిస్తోంది. సినిమా నిడివి 2.52 నిమషాల దగ్గర ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిడివి స్మోకింగ్ ప్రకటనలతో కలిపి. ఈ నిడివి విషయంలో కాస్త తర్జన భర్జనలు పడి, మెగాస్టార్ సలహాలు, సూచనలు కూడా తీసుకున్న తరువాత అక్కడే ఫిక్స్ చేసారట. వాస్తవంగా ఫైనల్ కట్ అయితే మూడు గంటల మేరకు వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమాను ఎలా ఎండ్ చేయాలా? అన్న దానిపై కాస్త డిస్కషన్లు జరిగాయని, రెండు మూడు రకాల క్లయిమాక్స్ లు చిత్రీకరించి వుంచారని, ఆఖరికి ఒకటి ఫైనల్ చేసారని కూడా వినిపిస్తోంది. కానీ ఇది కేవలం గ్యాసిప్ నా, నిజమేనా? అన్నిది డవుట్. ఇండస్ట్రీ సర్కిళ్లలో అయితే వినిపిస్తున్న మాట ఇది.

సినిమా మొత్తానికి హైలైట్ అయ్యేది, జనం ఎక్కువగా మాట్లాడుకునేది రామ్ చరణ్ గురించే అవుతుందని టాక్. అంత బాగా చేసాడని, రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ అవుట్ పుట్ ఈ సినిమానే అవతుందని టాక్ వినిపిస్తోంది.