నాని-విక్రమ్ కుమార్ ప్రాజెక్టు డౌట్?

విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ సినిమాను హీరో నానితో చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమా దాదాపు పక్కా అని కూడా అనుకున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే,…

విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ సినిమాను హీరో నానితో చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ సినిమా దాదాపు పక్కా అని కూడా అనుకున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ సినిమా డౌట్ లో పడిందన్నది.

విషయం ఏమిటంటే, విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి నాని ముందు ఓకె అన్నారని వార్తలు వచ్చాయి. అది వాస్తవమే అని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథ సెకండాప్ నచ్చలేదనో, మరోటనో మొత్తం మీద ఆ ప్రాజెక్టుకు హీరో నాని ఫుల్ స్టాప్ పెట్టారని తెలుస్తోంది. కేవలం కథే నచ్చలేదా? ప్రాజెక్టు సెట్ కాలేదా? అన్న అనుమానాలు కూడా వున్నాయి.

ఎందుకంటే విక్రమ్ కుమార్ దగ్గర ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు వున్నాయి. మైత్రీ మూవీస్, స్వప్నదత్, మంజుల ఘట్టమనేని అడ్వాన్స్ లు వున్నాయి. స్వప్నదత్ హోమ్ బ్యానర్ వైజయంతీకి ఇప్పటికే నాని ఓ సినిమా స్టార్ట్ చేసారు. నాగ్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ అది. మైత్రీ మూవీస్ వరుస సినిమాలతో బిజీగా వుంది. ఆ మధ్య ఓ సినిమా నానితో ప్లాన్ చేసినా, కథ నచ్చక ఆగిపోయింది. అదే ఇప్పుడు సాయి ధరమ్ తేజతో నిర్మాణం దిశగా వెళ్తోంది. ఇక చేస్తే మంజుల ఘట్టమనేనికే చేయాలి.

ఇక్కడ వినిపిస్తున్న మరో గుసగుస ఏమిటంటే ఇప్పట్లో మంజుల ఘట్టమనేనికి ప్రాజెక్టు చేయడం నానికి అంతగా ఇష్టం లేదని. అందుకే ఏదో వంకతో ఆ ప్రాజెక్టు ఫుల్ స్టాప్ పెట్టారని. ఇలాంటి గుసగుస ఎందకు వినిపిస్తోందంటే, ఏ కథ అయితే విక్రమ్ కుమార్ చెప్పాడో, ఆ కథను మంజుల తన కోసం లాక్ చేసుకున్నారని, దాన్ని వేరే హీరోతో ప్లాన్ చేసేందుకు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

అలాగే స్వప్నదత్ కూ విక్రమ్ కుమార్ ఓ కథ చెప్పారు. దాన్ని ఆమె లాక్ చేసారు. ఒకటి రెండు రోజుల్లో స్వప్నదత్ ఆ కథను ఓ హీరోకి వినిపించబోతున్నట్లు సమాచారం. అంటే ఇవన్నీ కూడుకుంటే, విక్రమ్ కుమార్ ఇటు స్వప్నదత్ నో, అటు మంజుల ఘట్టమనేనితోనో వేరే హీరోలతో సినిమాలు చేసే పనిలో బిజీగా వున్నట్లు అర్థం అవుతోంది.

మరి నాని మనసులో ఏముందో?