వాయిదాల పర్వంలో ‘సాయిపల్లవి’ సినిమా

నాగశౌర్య-సాయిపల్లవి జంటగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన కణం సినిమా విడుదల కష్టాలు ఇంకా తొలగిపోలేదు. డిసెంబర్ నుంచి విడుదల మాట వినిపిస్తోంది కానీ ఇప్పటికి ఇంకా రాలేదు. ఈ నెల 9న విడుదల పక్కా…

నాగశౌర్య-సాయిపల్లవి జంటగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన కణం సినిమా విడుదల కష్టాలు ఇంకా తొలగిపోలేదు. డిసెంబర్ నుంచి విడుదల మాట వినిపిస్తోంది కానీ ఇప్పటికి ఇంకా రాలేదు. ఈ నెల 9న విడుదల పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో వారం, రెండు వారాలు వెనక్కు వెళ్లే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

విజయ్ డైరక్షన్ లో ఈ సినిమా అబార్షన్ల నేపథ్యంలో హర్రర్ జోనర్ లో తయారైంది. ఈ నెల తొమ్మిదిన విడుదల చేద్దామని అంతా డిసైడ్ చేసుకుంటే థియేటర్ల బంద్ వచ్చి పడింది. తెలుగునాట బంద్ విషయంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నా, తమిళనాట ఏక మాటపై బంద్ సాగుతోంది. అందువల్ల ఇక వాయిదా వేసుకోక తప్పడం లేదు.

అయితే 16లోపు బంద్ విరమణ జరిగితే ఆ రోజున, లేదా 23న సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైమ్ లోనే హీరో నాగశౌర్యకు, హీరోయిన్ సాయి పల్లవికి పొసగలేదు.

ఆఖరికి హీరోను పక్కన పెట్టి, సినిమా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సాయిపల్లవి కూడా ప్రత్యేకంగా బైక్ పై సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చి, జనాల దృష్టి అటు మరల్చడానికి తనవంతు సాయం తను చేసింది.