ఎక్స్ క్లూజివ్-రాజమౌళి-మరో బాహుబలి

అలవాటైపోయిన తరువాత మారడం అంటే కష్టం. బాహుబలి లాంటి భారీ సినిమా తీసిన తరువాత మళ్లీ చిన్న సినిమా అటెంప్ట్ చేయడం అంటే కష్టమే. చిన్న సినిమా చేసినా, అది పెద్దగానే మార్కెట్ అవుతుంది.…

అలవాటైపోయిన తరువాత మారడం అంటే కష్టం. బాహుబలి లాంటి భారీ సినిమా తీసిన తరువాత మళ్లీ చిన్న సినిమా అటెంప్ట్ చేయడం అంటే కష్టమే. చిన్న సినిమా చేసినా, అది పెద్దగానే మార్కెట్ అవుతుంది. అంతేకాదు, ఇలా రకరకాల వ్యవహారాలు వుంటాయి. అందుకే దర్శకుడు రాజమౌళి తన ప్లాన్ మార్చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఎన్టీఆర్-చరణ్ కాంబినేషన్ లో చేయబోతున్న సినిమా ఇప్పుడు ఓ భారీ సినిమా మాత్రమే కాదు. మహా భారీ సినిమా. దీంట్లో కూడా బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్నిరకాల నటులు వుంటారు. వందరోజుల షూట్ అనుకున్నది రెండు వందల యాభై రోజులకు పైగా అని మార్చేసుకున్నారు. సినిమాకు బడ్జెట్ కూడా రెండు వందల కోట్ల వరకు వుంటుందని తెలుస్తోంది.

త్రివిక్రమ్-ఎన్టీఆర్, బోయపాటి-చరణ్ సినిమాల తరువాత ఈ సినిమా ఒక్కటే ఆ హీరోలు చేస్తారు. మళ్లీ 2019 చివరి వరకు మరో సినిమా జోలికి వెళ్లకపోవచ్చు. ఇలా మార్పులు చేసేయడంతో రాజమౌళి ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు. కథ, కథనాలు, దానికి కావాల్సిన వ్యవహారాలు అన్నీ మారిపోయాయి.

వన్ డే ఫొటో షూట్

రంగస్థలం పూర్తయింది. చరణ్ ఫ్రీ అయ్యారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ వెనక్కు వెళ్లింది. మార్చి మూడోవారం అనుకున్నది కాస్తా ఏప్రియల్ కు జరిగింది. దాంతో ఎన్టీఆర్ ప్రీ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరికి తన కొడుకు కార్తీక్ ను ఇచ్చి రాజమౌళి అమెరికా పంపిస్తున్నారు.

అక్కడ లాస్ ఏంజెల్స్ లో వన్ డే ఫొటో షూట్ ప్రత్యేకంగా చేయబోతున్నారు. వన్ డే ఫొటో షూట్ తరువాత ఇండియాకు వచ్చేస్తారు. రాజమౌళి కూడా జాయిన్ అవుతారని, కాదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రీ పొడక్షన్ ప్లానింగ్ కారణంగా రాజమౌళి వెళ్లడంలేదు. అమెరికాలో డిస్ట్రిబ్యూటర్ ఈ పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.