రంగస్థలంపై ప్రేమ అందుకోసమా?

ఊరకరారు మహానుభావులు అని నానుడి. రాజమౌళి ప్రత్యేకంగా రంగస్థలం సెట్ కు వచ్చి మరీ ఫొటోగ్యాలరీ దిగారు. ఆ విధంగా ఆ సినిమా ప్రచారానికి తనవంతు సాయంచేసారు. ఇదంతా రామ్ చరణ్ తో తను…

ఊరకరారు మహానుభావులు అని నానుడి. రాజమౌళి ప్రత్యేకంగా రంగస్థలం సెట్ కు వచ్చి మరీ ఫొటోగ్యాలరీ దిగారు. ఆ విధంగా ఆ సినిమా ప్రచారానికి తనవంతు సాయంచేసారు. ఇదంతా రామ్ చరణ్ తో తను చేయబోయే సినిమాను దృష్టిలో పెట్టుకుని అనుకున్నారంతా.

కానీ విషయం అదికాదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సోదరుడు కీరవాణి కుమారుడు జైసింహా తొలిసారి రంగస్థలం సినిమాతో అసిస్టెంట్ డైరక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు.

ఈ విషయాన్ని గతంలో దర్శకుడు సినిమా ప్రెస్ మీట్ లోనే సుకుమార్ వెల్లడించారు. కీరవాణి కొడుకు తన దగ్గర రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నారని అప్పుడే చెప్పాడు. సుకుమార్ అంటే వున్న ఇష్టంతో రాజమౌళినే రికమెండ్ చేసి జైసింహాను రంగస్థలం సినిమాలో చేర్చాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు అందుకే సెట్ కు వెళ్లాడని టాక్ వినిపిస్తోంది.

ఆ మధ్య రాజమౌళి కొడుకు కార్తీక్ అన్ని నిర్మాణ బాధ్యతలు తీసుకుని నాగచైతన్యతో యుద్ధం శరణం సినిమా చేసారు. టోటల్ డిజాస్టర్ అయింది. నిర్మాత సాయి కొర్రపాటికి దారుణాతి దారుణమైన నష్టం వచ్చింది. ఆ బోణీ తరువాత కీరవాణి కొడుకు అప్రెంటీస్ బోణీ రంగస్థలం. ఇదెలా వుంటుందో చూడాలి.