తేజు తరువాతి సినిమా వాళ్లకేనంట

సాయి ధరమ్ తేజ వరుస ఫ్లాప్ ల్లో వున్నా, అతని కెరీర్ లైన్ కు మాత్రం ఢోకా లేదు. ప్రస్తుతం కరుణాకరన్ తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఆ తరువాత గీతా, మైత్రీ,…

సాయి ధరమ్ తేజ వరుస ఫ్లాప్ ల్లో వున్నా, అతని కెరీర్ లైన్ కు మాత్రం ఢోకా లేదు. ప్రస్తుతం కరుణాకరన్ తో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఆ తరువాత గీతా, మైత్రీ, భగవాన్-పుల్లారావులకు మూడు సినిమాలు చేయాల్సి వుంది.

అయితే కరుణాకరన్ సినిమా తరువాత తమదే అని, మే నుంచి తమ సినిమా షూట్ ప్రారంభం అని అధికారికంగా ప్రకటించారు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న భగవాన్-పుల్లారావు.

కానీ ఇప్పుడు మొత్తం మారిపోయిందని తెలుస్తోంది. నాని కోసం కిషోర్ తిరుమల తయారు చేసిన లవ్ స్టోరీతో మైత్రీ సంస్థ నిర్మించే సినిమాను తేజు ముందుగా చేస్తాడట. కరుణాకరన్ సినిమా అయిపోగానే మే నెలలో ఆ సినిమానే సెట్ మీదకు వెళ్తుందట. ఆ తరువాతనే గీతా-మారుతి కాంబినేషన్ సినిమా వుంటుందట.

అంటే గోపీచంద్ మలినేని దగ్గర దగ్గర ఈ ఏడాది అంతా వెయిటింగ్ లోనే వుండేలా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. కరుణాకరన్ తో లవ్ జోనర్ లో సినిమా చేస్తున్న తేజు, కిషోర్ తిరుమలతో కూడా ఇంచుమించు అదే జోనర్ లో సినిమా చేయబోతున్నాడు.