‘బుర్రా’ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు

ఈ మధ్యకాలంలో మాటల రచయితగా కార్డ్ వేస్తే ప్రాజెక్ట్ కు క్రేజ్ వస్తుంది అనిపించుకున్నవారు తక్కువ. బుర్రా సాయిమాధవ్ కు ఆ క్రేజ్ కాస్త వుంది. ప్రస్తుతం శ్రీకారం సినిమాను ఫినిష్ చేసిన బుర్రా…

ఈ మధ్యకాలంలో మాటల రచయితగా కార్డ్ వేస్తే ప్రాజెక్ట్ కు క్రేజ్ వస్తుంది అనిపించుకున్నవారు తక్కువ. బుర్రా సాయిమాధవ్ కు ఆ క్రేజ్ కాస్త వుంది. ప్రస్తుతం శ్రీకారం సినిమాను ఫినిష్ చేసిన బుర్రా రెండు క్రేజీ ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నారు.  

గుణశేఖర్ 'శాకుంతలం' వాటిల్లో ఒకటి. త్వరలో సెట్ మీదకు వళ్లే ఈ ప్రాజెక్టుకు బుర్రా అప్పుడే పని ప్రారంభించేసారు. రెండో క్రేజీ ప్రాజెక్టు రామ్ చరణ్-శంకర్-దిల్ రాజు కాంబినేషన్ లో తయారయ్యే సినిమా. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు బుర్రాను రైటర్ గా తీసుకున్నట్లు బోగట్టా. 

ఇది కాక ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ కూడా వుంది. అది టైమ్ పడుతుంది. రానా హీరోగా 14  రీల్స్ ప్లస్ పతాకంపై సిర్మించే సినిమా అది. ఇదిలా వుంటే ఇన్ని ప్రాజెక్ట్ లు చేతిలో వున్నా, బుర్రా మాత్రం ఎంత త్వరగా డైరక్టర్ చైర్ లో కూర్చుంటానా? అని చూస్తున్నారు. 

ఇందుకోసం ఓ సబ్జెక్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. అనుష్క హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని టాక్ అయితే వుంది. కానీ అది ఎప్పుడు అన్నదే తెలియదు. 

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు