రంగస్థలం సీడెడ్, నైజాం క్లోజ్

వచ్చే నెల ఆఖరులోనే విడుదల రంగస్థలం సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలు అయితే వున్నాయి. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ కావడం, అలాగే…

వచ్చే నెల ఆఖరులోనే విడుదల రంగస్థలం సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలు అయితే వున్నాయి. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ కావడం, అలాగే రామ్ చరణ్ ఓ డిఫరెంట్ పాత్ర పోషించడం, అన్నింటికి మించి 1985నాటి కథాకాలం కావడం.

ఈసినిమా బిజినెస్ ను మెలమెల్లగా క్లోజ్ చేస్తున్నారు. ఓవర్ సీస్, శాటిలైట్, డిజటల్ ఇలాంటివి ఎప్పుడో క్లోజ్ అయ్యాయి. అలాగే ఇప్పటికే అడ్వాన్స్ లు తీసుకున్న నైజాం, అలాగే సీడెడ్ కూడా బిజినెస్ క్లోజ్ చేసారు. నైజాంలో తొలిసారి యువి క్రియేషన్స్ ఈసినిమాతో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 18కోట్లకు యువి క్రియేషన్స్ నైజాం హక్కులు తీసుకుంది. మరో రెండు కోట్లు రిటర్న్ గ్యారంటీ పెట్టారు.

ఇక సీడెడ్ మొత్తాన్ని ముగ్గురికి ఇచ్చారు. సీడెడ్, బళ్లారి కలిపి 12.06 కోట్లకు విక్రయించారు. బళ్లారిని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తీసుకున్నారు. ఇక ఆంధ్ర మాత్రం వుంది. బేరసారాలు సాగుతున్నాయి.